ఛీ.. అది తల్లేనా? పిల్లల్ని ఓవెన్ లో పెట్టి చంపి.. వీడియోను భర్తకు పంపిన భార్య
అట్లాంటాకు చెందిన లమోరా విలియమ్స్ తన రెండేళ్ల కుమారుడు కెయుంటే పెన్, ఏడాది వయసున్న చిన్నారి జౌకార్టర్ విలియమ్స్ లను ఓవెన్ లో పెట్టి చంపేసినట్లు ఆరోపిస్తూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన భా
వాషింగ్టన్: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన పిల్లల్ని ఓవెన్ లో పెట్టి దాన్ని ఆన్ చేసి వారిని ఉడికించి చంపేసింది. దీన్నంతా వీడియో తీసి భర్తకు పంపించింది.
అట్లాంటాకు చెందిన లమోరా విలియమ్స్ తన రెండేళ్ల కుమారుడు కెయుంటే పెన్, ఏడాది వయసున్న చిన్నారి జౌకార్టర్ విలియమ్స్ లను ఓవెన్ లో పెట్టి చంపేసినట్లు ఆరోపిస్తూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
తన భార్య తనతో వీడియో చాట్ చేస్తుండగా.. ఏదో ఘోరం జరగబోతోందని తాను గ్రహించానని, వెంటనే పోలీసులకు సమాచారం అందించానని ఆ చిన్నారుల తండ్రి జమీల్ పెన్ తెలిపారు.
జమీల్ పెన్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు లమోరా విలియమ్స్ ఇంటికి చేరుకునే సరికే ఘోరం జరిగిపోయింది. శరీరం అంతా ఉడికిపోయి ఓవెన్ లోనే చిన్నారులిద్దరూ మరణించారు.
లమోరా విలయమ్స్ మానసిక వ్యాధితో బాధపడుతోందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో విలియమ్స్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.