పబ్లిక్ ప్లేస్, పక్కనే పిల్లలు.. ప్యాంటు విప్పేసి, పని కానిచ్చేసింది
బ్రిటన్ : అదో బహిరంగ ప్రదేశం.. అంతకుమించి అమరవీరుల స్మృతి చిహ్నాం నిర్మించిన పవిత్ర స్థలం.. పక్కనే తన ఐదుగురు కొడుకులు కూడా ఉన్నారు, కానీ ఇవేవి పట్టించుకోని ఆ మహిళ సరాసరి అమరవీరుల స్థూపం దగ్గరికెళ్లి దాని ఎదురుగా మూత్ర విసర్జన చేసేసింది.
కెల్లీ మార్టిన్ అనే 42 ఏళ్ల మహిళ చేసిన ఈ నిర్వాకం ప్రస్తుతం బ్రిటన్ అంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత శుక్రవారం నాడు ఎసెక్స్ అనే ప్రాంతంలోని గ్రేస్ హై స్ట్రీట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎవరో వ్యక్తి సదరు మహిళ మూత్ర విసర్జన సమయంలో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం కాస్త బయటకు పొక్కింది.
దీంతో కెల్లీ చేసిన నిర్వాకంపై అక్కడి మీడియాతో సహా ప్రజలంతా తీవ్రంగా విమర్శిస్తున్నారు. విషయం పోలీసు అధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో పబ్లిక్ డీసెన్సీకి భంగం కలింగించినందుకు గాను ఆమెను అరెస్టు చేశారు. కాగా, రెండవ ప్రపంచ యుద్ద సమయంలోను కొరియన్ వార్ సమయంలోను ప్రాణ త్యాగం చేసిన 20 వేల మంది సైనికుల స్మృతి చిహ్నంగా స్థూపాన్ని నిర్మించింది బ్రిటన్ ప్రభుత్వం. దీంతో బ్రిటన్ ప్రజలంతా పవిత్రంగా భావించే అలాంటి స్థలంలో కెల్లీ మూత్ర విసర్జనకు పాల్పడడం అక్కడి ప్రజలను కోపోద్రిక్తులను చేస్తోంది.