ప్రియుడితో కలిసి బెడ్ రూంలో తల్లి: చూశారని బిడ్డల్ని చంపించింది
కైరో: ఈజిప్ట్ దేశంలో దారుణం జరిగింది. ఓ తల్లి, ప్రియుడితో కలిసి తన ఇద్దరు పిల్లలను చంపేసింది. సదరు ప్రియుడితో కలిసి తాను ఇంట్లో ఉండగా వారు చూసినందుకు ఆమె వారిని చంపేసింది. సమాచారం మేరకు.. నజత్ అనే 31 ఏల్ల వయస్సు గల మహిళ తన తప్పును పోలీసుల ఎదుట అంగీకరించింది.
ఇద్దరి పిల్లలను చంపేయాలని తన ప్రియుడికి సూచించింది. తాము కలిసి ఉండగా చూసిన తన ఏడేళ్ల కూతురు, అయిదేళ్ల కొడుకును చంపాలని సూచించింది. ఆ పిల్లలిద్దరు కూడా తల్లిని, ఆమె ప్రియుడిని కైరోలో గల తమ అపార్టుమెంటులోని ఇంటి బెడ్ రూంలో ఉండగా చూశారు.
ఆమె ప్రియుడు.. కొడుకు గొంతు కోసినప్పుడు అతను హెచ్చరించాడు. తాను తన తండ్రికి, ఇంటి దగ్గరలో ఉన్న అంకుల్కు చెబుతానని చెప్పాడని తెలుస్తోంది. నిద్రలో ఉన్న తన కూతురు లేచి, ఏం జరుగుతోందో చూసిందని నిందితురాలైన మహిళ చెప్పిందని, ఈ సమయంలో తన కూతురును మౌనంగా ఉంచేలా చూడాలని తన ప్రియుడికి చెప్పిందని పోలీసులు తెలిపారని సమాచారం.