పుల్వామా అమరవీరులకు మక్కాలో ప్రార్థనలు .. మోదీకి మంచి జరుగాలని ముస్లిం దువా .. వైరలవుతోన్న వీడియో
సౌదీ అరేబియా : పుల్వామాలో ఉగ్ర మూకల దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. వీర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది. ముస్లింలు పవిత్రంగా భావించే మక్కాలో ఓ ముస్లిం సోదరుడు భారత వీర జవాన్లకు దువా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
జవాన్లకు దువా
సాంప్రదాయ ముస్లిం మాదిరిగా డ్రెస్ వేసుకొని .. సీఆర్పీఎఫ్ జవాన్ల కోసం ప్రార్థించాడు. ఉగ్ర దాడిలో చనిపోయిన కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని అల్లాహ్ సాక్షిగా కోరాడు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. అలాగే ఆయా కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్మం కల్పించాలని దువా చేసినట్టు తెలిపాడు.
మోదీ, అమిత్ షా బాగుండాలి
వీరులను స్మరించుకున్న అతడు .. ప్రధాని, మోదీ అమిత్ షా బాగుండాలని కోరుకున్నాడు. ఉగ్రవాదులు, పాకిస్థాన్ దిగజారి దాడులు చేస్తున్న సంయమనంతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వారిద్దరూ ఆయురార్యోగాలతో మంచిగా ఉండాలని స్వచ్ఛ మనస్సుతో అభిలాషించాడు.
పాక్ బుద్ది తెచ్చుకో ..
మక్కాలో ఓ ముస్లిం చేసిన వీడియోతో ఇకనైనా బుద్ధి తెచ్చుకో పాకిస్థాన్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన కూడా సాంప్రదాయ ముస్లిమే కానీ మానవత్వం ఉన్నా మంచి మనిషి .. అందుకే ఆ వీడియాలో ఉగ్ర వాదుల దుశ్చర్యను ఖండించారని గుర్తుచేస్తున్నారు. ఓ పాకిస్థాన్ ఇకనైనా నీ వక్రబుద్ధిని మార్చుకో .. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకు ... వారిని పెంచి పోషించకు అని హితవు పలికారు.