గల్లంతైన సైనిక విమానం: అండమాన్ తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహాలు, శకలాలు
116మంది ప్రయాణికులతో గురువారం గల్లంతైన మయన్మార్ సైనిక విమాన శకలాలు, ప్రయాణీకుల మృతదేహాలు అండమాన్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చినట్లు ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు.
యంగూన్: 116మంది ప్రయాణికులతో గురువారం గల్లంతైన మయన్మార్ సైనిక విమాన శకలాలు, ప్రయాణీకుల మృతదేహాలు అండమాన్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చినట్లు ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు. గురువారం ఉదయం 8.25గంటల సమయంలో అండమాన్ సముద్ర తీరంలో అలలకు మూడు మృతదేహాలు కొట్టుకు వచ్చాయి.
116 మందితో వెళ్తున్న సైనిక విమానం గల్లంతు
మృతుల్లో ఒక మహిళ, చిన్నారి కూడా ఉన్నారు. అంతేగాక ఆ విమాన ప్రయాణికుల లగేజీ, సేఫ్టీ జాకెట్లు, ఎయిర్క్రాఫ్ట్ చక్రం ఒకటి లభ్యమయ్యాయి. మిగతా వారి మృతదేహాల కోసం నావికా దళ అధికారులు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు సైనిక సమాచార బృందం ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
మయన్మార్లోని లాంగ్లాన్ తీర ప్రాంతంలో విమాన శకలాన్ని గుర్తించినట్లు ఆర్మీ చీఫ్ ఆఫీస్ కమాండర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం సైనిక విమానం గల్లంతైన విషయం తెలిసిందే.
అండమాన్ సముద్రంలో కుప్పకూలిన మయన్మార్ మిమానం
ఈ విమానంలో ఎక్కువ మంది సైనిక సిబ్బంది కుటుంబసభ్యులే ఉన్నారు. వారిలో 15 మంది చిన్నారులు, 35 మంది సైనికులు, 14 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు మయన్మార్ ఆర్మీ చీఫ్ కార్యాలయం వెల్లడించింది.