వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవాజ్ షరీఫ్‌తో ప్రధాని మోడీ కరచాలనం(ఫొటో)

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌లు కలుసుకున్నారు. ఆత్మీయంగా వారు కరచాలనం చేసుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది.

సోమవారం ప్యారిస్‌లో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్థాయి సదస్సు(సిఓపి-21) ప్రారంభమైంది. ఈ సదస్సుకు హాజరైన మోడీ, షరీఫ్‌లు ఒకరినొకరు కలుసుకుని నవ్వుతూ కరచాలనం చేశారు.

Narendra Modi meets Nawaz Sharif at climate summit in Paris

ఈ ఫొటోను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి దాదాపు 140 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.

కాగా, ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీ మొదట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండ్‌ను కలుసుకున్నారు. ఆయనతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. ఆ తర్వాత వివిధ దేశాధినేతలను పలుకరించారు.

ఈ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులపై ప్రస్తుత సదస్సు అత్యంత కీలకమైనదని, ఈ సదస్సులో వెలువడే నిర్ణయం ప్రస్తుతమున్న ప్రజల తలరాతనే కాదు.. రాబోయే తరాల ప్రజలపైనా ప్రభావం చూపుతుందని, ఈ సదస్సులో సానుకూల నిర్ణయాన్ని ప్రపంచం ఆశిస్తున్నదని చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi on Monday met his Pakistani counterpart Nawaz Sharif as world leaders converged here for the inauguration of the Conference of Parties (CoP) 21 climate summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X