ఆన్లైన్లో నేతాజీ అంతిమ సంస్కారాల వివరాలు
లండన్: భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన పలు దస్త్రాలను ఆన్లైన్లో విడుదల చేశారు. తైపీలో తాన్ తీ తీ అనే అధికారి అనుమతితో నేతాజీ దహన సంస్కారాలు అక్కడే నిర్వహించినట్లు ఇందులో పొందుపరిచారు.
1945 ఆగస్టు 18న తైపీ విమానాశ్రయం పరిసరాల్లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్లుగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి.. ఆయన మృతదేహం దహనసంస్కారాలు, ఆయన గడిపిన చివరి రోజులు తదితర సమాచారాన్ని యూకేకి చెందిన ఓ వెబ్సైట్ ఆన్లైన్లో పొందుపరిచింది.

ఈ సమాచారాన్నంతటినీ www.bosefiles.info అనే వెబ్సైట్లో పొందుపరిచినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. యూకే విదేశీ వ్యవహారాల కార్యాలయం ఫైల్ నెం. 1852/6, 1956 పేరుతో ఈ వివరాలను వెల్లడించారు. 1945, ఆగస్టు 22న సుభాష్ చంద్రబోస్ అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు ఓ ఇంటర్వ్యూలో తీతీ చెప్పినట్లు పేర్కొన్నారు.
అయితే, సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతిచెందారనే విషయంపై ఇప్పటి వరకు కచ్చితమైన ఆధారాలు లేవు. నేతాజీ గురించిన విషయాలు తరచూ చర్చనీయాంశమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ఉంచడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications