స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన రైలు, కూలిన స్టేషన్ సీలింగ్, ముగ్గురి మృతి
న్యూజెర్సీ: న్యూజెర్సీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గురువారం నాడు రైలు క్రాష్ అయిన సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఈ సంఘటన న్యూజెర్సీలోని హోబోకెన్ రైల్వే స్టేషన్లో జరిగింది.
స్టేషన్లోకి ప్రవేశిస్తున్న రైలు పైమ స్టేషన్ పైకప్పు కూలిపోయింది. రైలు ప్లాట్ ఫాంకు ఆధారంగా ఉన్న వాటివైపు దూసుకెళ్లడంతో ఇది జరిగిందని తెలుస్తోంది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలియడంతో పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలం చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. న్యూజెర్సీలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇదీ ఒకటి.
ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు నిలిచిపోయాయి. ఈ సంఘటన గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయానికి చేరుకుంది. న్యూయార్క్లోని స్పింగ్ వ్యాలీలో ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకు బయలు దేరింది. రైలు ప్రమాదం నుండి బయట పడ్డ ప్రయాణీకులు.. తాము లక్కీగా తప్పించుకున్నామని ట్వీట్ చేశారు.