సెల్ఫీ విత్ డాటర్ చిక్కు: డిగ్గీ రాజాతో ప్రేయసి ఫొటో
న్యూఢిల్లీ: కూతురితో సెల్ఫీ తీసుకుని పోస్టు చేయండంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను చిక్కుల్లో పడేసింది. ఏడు పదుల వయస్సులో పడిన దిగ్విజయ్ సింగ్ నలభయ్యో పడిలో ఉన్న అమృతా రాయ్ అనే జర్నలిస్టును త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్న విషయం అందరికీ తెలిసిందే.
వాళ్లిద్దరు కలిసి దిగిన ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వాటిని చూసిన అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తప్పు చేసింది. అమృతా రాయ్ని డిగ్గీ రాజా కూతురు అనుకుిని వాళ్లిద్దరు కలిసి తీసుకున్న ఫొటోను సెల్ఫీ విత్ డాటర్ విభాగంలో చేర్చేసింది.
ఆ విషయాన్ని ఓ వ్యక్తి కనిపెట్టేసి దాన్ని ట్వీట్ చేశాడు. చాలా మంది తండ్రులు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు స్పందించి తమ కూతుళ్లలతో సెల్ఫీలు తీసుకున్నారనే వార్తాకథనంలో మరికొన్ని ఫొటోలను కూడా కలిపి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిగ్గీ రాజా, అమృతరాయ్ కలిసి ఉన్న ఫొటోను కూడా ప్రచురించింది.
దిగ్విజయ్ సింగ్ భాహర్య ఆశ 2013లో మరణించింది. అమృత రాయ్తో తనకు సంబంధం ఉందని, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఏ విధమైన అభ్యంతరం లేదని, ఆమె భర్తతో విడాకులకు దరఖాస్తు చేసుకుందని దిగ్విజయ్ సింగ్ నిరుడు చెప్పారు.
దిగ్విజయ్ సింగ్ విషయంలో తప్పులో కాలేసిన న్యూయార్క్ టైమ్స్ వెంటనే సవరణను వేసింది. ఆ తప్పునకు విచారిస్తున్నామంటూ తెలిపింది. ట్విట్టర్లో పలువురు ఆ ఫొటోపై సెటైర్లు విసురుతుండడంతో న్యూయార్క్ టైమ్స్ ఆ సవరణ ఇచ్చింది.