వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: నైజీరియాలో ఆత్మాహుతి దాడి.. 50మంది మృతి

మంగళవారం ఉదయం ఈశాన్య అదమ‌వాలోని మ‌సీదులో ప్రార్థ‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ టీనేజర్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు.

|
Google Oneindia TeluguNews

అబుజా: ఆత్మాహతి దాడితో నైజీరియా ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం ఈశాన్య అదమ‌వాలోని మ‌సీదులో ప్రార్థ‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ టీనేజర్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు.

ఈ దాడిలో దాదాపు 50మంది దాకా మృతి చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. పదుల సంఖ్యలో జనం తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పేలుడు పదార్థాలతో మసీదులోకి వచ్చిన యువకుడు తనకు తాను పేల్చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Nigeria mosque attack: teenage suicide bomber kills at least 50 people

నైజీరియన్ ఉగ్రవాద సంస్థ బొకోహారమ్ ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో టీనేజర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్న బొకోహారమ్ వారిని ఉపయోగించుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరిస్తోంది.

ఆత్మాహుతి దాడి ఎవరి పనై ఉంటుందని పోలీస్ అధికారి అబూబకర్ ను మీడియా ప్రశ్నించగా.. 'ఇది ఎవరి పనో మనకందరికీ తెలుసు. ఎవరినో ప్రత్యేకంగా అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ దీని వెనుకాల ఎవరున్నారన్నది మనకి తెలిసిన విషయమే' అంటూ బదులిచ్చారు.

English summary
A teenage suicide bomber blew himself up as worshippers gathered for morning prayers at a mosque in north-eastern Nigeria
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X