వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెత్తురోడిన కాబూల్: బాంబు పేలుళ్లలో 29మంది మృతి..

|
Google Oneindia TeluguNews

కాబూల్: ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ నగరం‌లో మరో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో మొత్తం 29మంది మృతిచెందగా, ఇందులో 9మంది జర్నలిస్టులు సహా ప్రముఖ మీడియా సంస్థ ఏఎఫ్‌పీ(ఏజెన్స్-ఫ్రాన్స్ ప్రెస్) కి చెందిన ఫోటోగ్రాఫర్‌ షా మరై ఉన్నారు.

Nine journalists among 29 killed in twin Afghanistan blasts

సోమవారం ఉదయం 8గం. సమయంలో షష్డారక్ ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలువురు ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు అక్కడికి చేరుకోగా మరో పేలుడు సంభవించింది. కెమెరామెన్ లాగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు.

ఈ రెండు పేలుడు ఘటనల్లో మొత్తం 29 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 45 మంది గాయపడ్డారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతంలోనే అమెరికన్ దౌత్య కార్యాలయం కూడా ఉండటం గమనార్హం.

English summary
A number of journalists, including a senior AFP photographer, have died in a suicide attack as a bomber disguised as a fellow cameraman detonated a second bomb at the site of an earlier explosion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X