నెత్తురోడిన కాబూల్: బాంబు పేలుళ్లలో 29మంది మృతి..
కాబూల్: ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలో మరో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో మొత్తం 29మంది మృతిచెందగా, ఇందులో 9మంది జర్నలిస్టులు సహా ప్రముఖ మీడియా సంస్థ ఏఎఫ్పీ(ఏజెన్స్-ఫ్రాన్స్ ప్రెస్) కి చెందిన ఫోటోగ్రాఫర్ షా మరై ఉన్నారు.
సోమవారం ఉదయం 8గం. సమయంలో షష్డారక్ ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలువురు ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు అక్కడికి చేరుకోగా మరో పేలుడు సంభవించింది. కెమెరామెన్ లాగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు.
#UPDATE Agence France-Presse's chief photographer in Kabul, Shah Marai, has been killed.
— AFP news agency (@AFP) April 30, 2018
He died in a blast that was targeting a group of journalists who had rushed to the scene of a suicide attack in the Afghan capital pic.twitter.com/rOa4rg24x9
ఈ రెండు పేలుడు ఘటనల్లో మొత్తం 29 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 45 మంది గాయపడ్డారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతంలోనే అమెరికన్ దౌత్య కార్యాలయం కూడా ఉండటం గమనార్హం.