ఆటకట్టు : నీరవ్ మోదీ అరెస్ట్, కోర్టు వారెంట్ జారీతో అదుపులోకి ఆర్థిక నేరస్థుడు
Recommended Video
లండన్ : పంజాబ్ బ్యాంకుల కన్షార్షియంకు 13 వేల కోట్ల కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి .. రిమాండ్ తీసుకోనున్నారు.
ఈ కాంగ్రెస్ కు ఎమైంది....? ఓ వైపు టిఆర్ఎస్ ...మరో వైపు బిజేపి....ఎవరు నోరు మెదపరేంది..?
ఆర్థిక నేరస్తుడి అరెస్ట్
బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ .. తొలుత అమెరికాలో ఉన్నాడు. తర్వాత లండన్కు మకాం మార్చాడు. నీరవ్ మోదీని పట్టుకునేందుకు భారత్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల ముందు నీరవ్ అరెస్ట్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లండన్ వీధుల్లో సంచారం ..
బ్యాంకులను మోసం చేసి పారిపోయి నీరవ్ మోదీ జాడ తెలియలేదు. అయితే ఇటీవల లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నట్టు టెలీగ్రాఫ్ పత్రిక ఆయన బండారాన్ని బయటపెట్టింది. లండన్ లో ఖరీదైన ఇంట్లో ఉంటూ .. తిరిగి వజ్రాల వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నది. ఈ క్రమంలో విపక్షాల విమర్శలతో మళ్లీ దౌత్యపర చర్చలు ప్రారంభించి ఆయన్ను వెనక్కి రప్పించేందుకు భారత్ ముమ్మరంగా ప్రయత్నాలు చేసింది.
లండన్లోనే సీబీఐ, ఈడీ
బ్యాంకుల ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు మేరకు ఈడీ రంగంలోకి దిగింది. ముంబైలో నీరవ్ ఆస్తులను కూడా జప్తు చేసింది.