వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరాశలో పాకిస్థాన్....! భారత్‌తో చర్చించేందుకు ఎలాంటీ విషయాలు లేవన్న...ఇమ్రాన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

కశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ ఏమీ చేయలేక విసిగిపోయిందా... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్న దారులన్ని మూసుకుపోయాయా..? దీంతో ఆయన ఇండియాతో ఇక వేగలేమని బావిస్తున్న ఇమ్రాన్ ఖాన్ నిరాశలో మిగిలిపోయాడు.. ఈ నేపథ్యంలోనే ఇండియాతో ఎలాంటీ సంప్రదింపులు,చర్చలు లేవని తెగేసి చెప్పాడు.ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాల మీద భారత్‌తో చర్చలు జరపడంపై ఎటువంటి ఆసక్తి లేదని అంతర్జాతీయ మీడీయాకు ఇచ్చిన ఇంటర్యూలో తన అసహనాన్ని వ్వక్తం చేశాడు.

కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికర్ రద్దుతో పాటు, రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా రెండు ముక్కలుగా చేసిన తర్వాత, దాయాదీ దేశమైన పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. దీంతో భారత దేశంతో తెగతెంపులు తెంచుకునే విధంగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో పాటు రవాణా వ్యవస్థను కూడ రద్దు చేసింది. ఇంతటితో ఆగకుండా కశ్మీర్ కోసం యుద్దాలు కూడ చేస్తామంటూ హెచ్చరికలు కూడ జారీ చేశాడు. అయినా భారత్ మాత్రం అదరలేదు, బెదరలేదు.

no longer interested in dialogue with India,Imran Khan said

ఇక లాభం లేదనుకుని కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి కూడ తీసుకెళ్లాడు. హడవిడి చేసి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించేలా పావులు కదిపాడు. కాని అక్కడ కూడ ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు లభించలేదు. దీనికి తోడు పెద్దన్న అమేరికా పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. సర్దుకుపోవాలని హితవు పలికింది. మరోవైపు పోరుగు దేశాలు కూడ పాకిస్థాన్‌‌కు మద్దతు పలకలేదు. బంగ్లాదేశ్ లాంటీ దేశాలు కూడ కనీసం సపోర్టు నిలవలేదు. ఇక కశ్మీర్‌లో కూడ ఎలాంటీ ఆందోళనలు చెలరేగకపోవడంతో పాకిస్థాన్‌కు ఎం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలోకి నెట్టివేయబడింది. దీంతో ఇక ముందేప్పుడు భారత దేశంలో శాంతి చర్చలు అంటూ ఉండవంటూ అక్రోశం వెల్లగక్కాడు, తాను చర్చల కోసం చాల ప్రయత్నాలు చేశానని ఇంటర్యూలో చెప్పారు. ఇక ముందు ఎలాంటీ చర్చలు ఉండవంటూ తేల్చిచెప్పాడు.

English summary
pakistan Prime Minister Imran Khan has said he is no longer interested in dialogue with India.In an interview to The New York Times, a day after he had a telephonic conversation with US President Donald Trump, Pakistan Prime Minister Imran Khan complained about what he described as "repeated rebuffs from Prime Minister Narendra Modi at his appeals for communication" -- both before and after the Indian government's move to abrogate provisions of Article 370 for Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X