మార్చి 18న భూమిపైకి భారీ సౌర తుఫాను?: అలాంటిదేం లేదన్న ఎన్ఓఏఏ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: మార్చి 18న ఎలాంటి భారీ సౌర తుఫాను భూమిపైకి రావడం లేదని నేషనల్ ఓసియానిక్ అండ్ ఆట్మస్పేరిక్ అడ్మిస్ట్రేషన్(ఎన్ఓఏఏ-నోవా) స్పష్టం చేసింది. అయితే, గత కొన్ని రోజులుగా పలు మీడియా సంస్థలు మార్చి 18న భారీ సౌర తుఫాను భూమిని ఢీకొడుతోందని కథనాలు ప్రచురితం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అలాంటిదేం లేదని నేషనల్ ఓసియానిక్ అండ్ ఆట్మస్పేరిక్ అడ్మిస్ట్రేషన్(ఎన్ఓఏఏ-నోవా) స్పష్టతనిచ్చింది. అది చాలా మైనర్ తుఫాను అని, భూమిపైగానీ, జీవరాశులపై గానీ తీవ్ర ప్రభావం ఉండబోదని తేల్చి చెప్పింది.
ఇటీవల కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో.. భూమికి అయస్కాంత తుఫాన్ లేదా సౌర తుఫాన్ (మాగ్నటిక్ స్ట్రోమ్ లేదా సోలార్ స్ట్రోమ్) ప్రమాదం పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని పేర్కొన్నాయి.
దాదాపు 159 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ తుఫాన్ వల్ల టెలీకమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, మనుషుల రక్త ప్రసరణపై కూడా దుష్ప్రభావం పడుతుందని వెల్లడించాయి.