నోబెల్ శాంతిబహుమతి విజేతల సమావేశం: మలాలా కూతురు లాంటిదన్న సత్యార్థి (ఫోటోలు)
న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి విజేతల సమావేశం ఓస్లోలో మంగళవారం జరిగింది. అయితే ఈ సమావేశంలో భారత్ నుంచి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి పాకిస్థాన్ నుంచి మలాలా యూసఫ్ జాయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్యార్థి కైలాశ్ మాట్లాడుతూ నోబెల్ బహుమతి అందుకోవడం గొప్ప అవకాశమని అన్నారు. ఈ బహుమతి తన బాధ్యతలను మరింత పెంచిందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మనుగడ కోసం కోట్లాది మంది బాలలు పోరాడుతున్నారని తెలిపారు.
మలాలా తన కూతురు లాంటిది.. ఆమెంటే తనకెంతో గౌరవమని చెప్పారు. బాలలను రక్షించాల్సిన నైతిక బాధ్యత తమందరిపై ఉందన్నారు. ఈ నెల 10న (బుధవారం) కైలాశ్ సత్యార్థి, మలాలా యూసఫ్ సంయుక్తంగా పురస్కరాన్ని అందుకోనున్నారు.
2014 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ఇద్దరిని వరించింది. పాకిస్దాన్ బాలిక మాలాలా యూసఫ్ జాయ్, భారతీయ బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్దిలకు ఈ బహుమతి సంయుక్తంగా 'రాయల్ కాడమీ ఆఫ్ స్వీడిష్' ప్రకటించిన విషయం తెలిసిందే.
విదీష ప్రాంతానికి చెందిన కైలాస్ సత్యార్ధి బచ్పన్ బచావో ఆందోళన్ పేరిట రెండున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. 80 వేల మంది బాలలను రకరకాల అణచివేతల నుంచి రక్షించారు. భారత్లో నోబెల్ బహుమతి అందుకోనున్నఏడవ భారతీయుడు కైలాస్ సత్యార్ధి. 17ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి మాలాలా యూసఫ్ జాయ్ పొంది రికార్డు సృష్టించింది.
నోబెల్ శాంతి బహుమతి సమావేశంలో పాల్గొన్న సత్యార్థి, మలాలా
నోబెల్ శాంతి బహుమతి విజేతల సమావేశం ఓస్లోలో మంగళవారం జరిగింది. అయితే ఈ సమావేశంలో భారత్ నుంచి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి పాకిస్థాన్ నుంచి మలాలా యూసఫ్ జాయ్ హాజరయ్యారు.
నోబెల్ శాంతి బహుమతి సమావేశంలో పాల్గొన్న సత్యార్థి, మలాలా
ఈ సందర్భంగా సత్యార్థి కైలాశ్ మాట్లాడుతూ నోబెల్ బహుమతి అందుకోవడం గొప్ప అవకాశమని అన్నారు. ఈ బహుమతి తన బాధ్యతలను మరింత పెంచిందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మనుగడ కోసం కోట్లాది మంది బాలలు పోరాడుతున్నారని తెలిపారు.
నోబెల్ శాంతి బహుమతి సమావేశంలో పాల్గొన్న సత్యార్థి, మలాలా
మలాలా తన కూతురు లాంటిది.. ఆమెంటే తనకెంతో గౌరవమని చెప్పారు. బాలలను రక్షించాల్సిన నైతిక బాధ్యత తమందరిపై ఉందన్నారు. ఈ నెల 10న (బుధవారం) కైలాశ్ సత్యార్థి, మలాలా యూసఫ్ సంయుక్తంగా పురస్కరాన్ని అందుకోనున్నారు.
నోబెల్ శాంతి బహుమతి సమావేశంలో పాల్గొన్న సత్యార్థి, మలాలా
విదీష ప్రాంతానికి చెందిన కైలాస్ సత్యార్ధి బచ్పన్ బచావో ఆందోళన్ పేరిట రెండున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. 80 వేల మంది బాలలను రకరకాల అణచివేతల నుంచి రక్షించారు. భారత్లో నోబెల్ బహుమతి అందుకోనున్నఏడవ భారతీయుడు కైలాస్ సత్యార్ధి.
నోబెల్ శాంతి బహుమతి సమావేశంలో పాల్గొన్న సత్యార్థి, మలాలా
విదీష ప్రాంతానికి చెందిన కైలాస్ సత్యార్ధి బచ్పన్ బచావో ఆందోళన్ పేరిట రెండున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. 80 వేల మంది బాలలను రకరకాల అణచివేతల నుంచి రక్షించారు. భారత్లో నోబెల్ బహుమతి అందుకోనున్నఏడవ భారతీయుడు కైలాస్ సత్యార్ధి.