మెడిసిన్లో జపాన్ ప్రొఫెసర్ యొషినోరి ఒషుమికి నోబెల్ ప్రైజ్
స్టాక్హోమ్: 2016 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు సంబంధించి నోబెల్ ప్రైజ్ ప్రకటలను మొదలయ్యాయి. ఈ ఏడాది వైద్యరంగం(మెడిసిన్) విభాగంలో జపాన్కు చెందిన యోషినోరి ఒషుమికి నోబెల్ ప్రైజ్ దక్కింది. ఈ మేరకు సోమవారం స్టాక్హోమ్లోని నోబెల్ కమిటీ ప్రకటించింది.
కణాల వినాశనానికి సంబంధించి (ఆటోఫాగి) ఆయన చేసిన ఆవిష్కరణలకుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆయనకు దక్కింది. జీవ పరిణామ క్రమంలో కణాలు వినాశం చెందుతుండగా, నూతన కణాల ఉత్పత్తికి సంబంధించి అధ్యయనం చేయడమే అటాఫజీ.
యోషినోరి ప్రస్తుతం టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ ఆటోఫాగి అన్న పదాన్ని తొలిసారి 1963లో క్రిస్టియన్ డీ డూవ్ వాడారు. ఈయనకు కూడా 1974లో మెడిసిన్ నోబెల్ లభించింది. ఆటోఫాగి 1960లలో బాగా వాడుకలోకి వచ్చింది.
ప్రైజ్ కింద 9లక్షలా 30 వేల అమెరికా డాలర్ల నగదు బహుమతిగా ఇస్తారు. కాగా, మంగళవారం ఫిజిక్స్లో బుధవారం కెమిస్ట్రీ, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు. కాగా గతేడాది మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ముగ్గురిని వరించిన సంగతి తెలిసిందే.
BREAKING NEWS The 2016 #NobelPrize #Medicine awarded to Yoshinori Ohsumi @tokyotech_en ”for his discoveries of mechanisms for autophagy” pic.twitter.com/PDxWbSqoIX
— The Nobel Prize (@NobelPrize) October 3, 2016
”I was surprised. I was in my lab” says Yoshinori Ohsumi on being awarded the 2016 #NobelPrize #Medicine. Interview to follow!
— The Nobel Prize (@NobelPrize) October 3, 2016
Ohsumi generated an enormous interest in autophagy and is now one of the most intensely studied areas of biomedical research #NobelPrize pic.twitter.com/sRp3IylW8m
— The Nobel Prize (@NobelPrize) October 3, 2016