ఫిజిక్స్లో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్
గురుత్వాకర్షణ తరంగాల పరిశోధనకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించారు. రైనర్ వేస్, బ్యారీ సి బారిష్, కిప్ ఎస్ థ్రోన్లకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది.
స్టాక్హోమ్: గురుత్వాకర్షణ తరంగాల పరిశోధనకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించారు. రైనర్ వేస్, బ్యారీ సి బారిష్, కిప్ ఎస్ థ్రోన్లకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది.
ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్
భౌతిక శాస్త్రంలో విశేష పరిశోధనలకు గాను వీరిని నోబెల్ పురస్కారం 2017 వరించింది. వీరు ముగ్గురు గురుత్వాకర్షణ తరంగాలపై చేసిన పరిశోధనలకు గాను ఈ అరుదైన గౌరవం లభించింది.
దీంతో 1901 నుంచి ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అందుకున్న 204 మంది జాబితాలో వీరు చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వీడన్లోని స్టాక్హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోబెల్ అసెంబ్లీ వెల్లడించింది.
ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో రైనర్ వేస్ మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యుడు కాగా, కిప్ థోర్న్, బ్యారీ బ్యారిష్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకులు.