ప్రపంచానికి ఉత్తరకొరియాతో ముప్పు:యుకివా
ప్రాంతీయ ఉపద్రవం స్థాయి నుండి అంతర్జాతీయ ముప్పుగా ఉత్తరకొరియా పరిణమించిందని అంతర్జాతీయ అణుశక్తి ఆందోళన వ్యక్తం చేసింది.
జెనీవా: ప్రాంతీయ ఉపద్రవం స్థాయి నుండి అంతర్జాతీయ ముప్పుగా ఉత్తరకొరియా పరిణమించిందని అంతర్జాతీయ అణుశక్తి ఆందోళన వ్యక్తం చేసింది.
ఉత్తరకొరియా గత ఆదివారం నాడు హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ప్రపంచానికి సరికొత్త సవాలును విసిరిందని ఐఎఈఏ అధినేత యుకిహ అమానో అభిప్రాయపడ్డారు.
ఉత్తరకొరియా ఆదివారం నాడు మరోసారి అణుబాంబును పరీక్షించడంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఉత్తరకొరియాకు ధీటుగా సమాధానమిచ్చేందుకు దక్షిణ కొరియా కూడ రెఢీ అయింది.
దక్షిణ కొరియా క్షిపణి పరీక్షలను ముమ్మరం చేయడమే కాకుండా అమెరికా నిర్మిత క్షిపణి రక్షణ వ్యవస్థ మోహరింపును తీవ్రతరం చేసింది.
ఉత్తరకొరియా అనుసరిస్తున్న విధానాలు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారాయన. గతంలో ఆ దేశం ప్రాంతీయ సవాలుగానే ఉంది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అణ్వాయుధాలు, క్షిపణులు కలిగిన ప్రపంచ ముప్పు అని యుకివా అభిప్రాయపడ్డారు.