ఉ. కొరియాలో పెను ప్రమాదం కుప్పకూలిన నూక్లియర్ బేస్, 200మంది మృతి
ఉత్తరకొరియాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పుంగ్గే-రీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం జపా
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పుంగ్గే-రీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం జపాన్ మీడియా వెలుగులోకి తెచ్చింది.
జపాన్ మీడియా కథనం ప్రకారం.. అక్టోబర్ 10న మిలిటరీ సైట్ వద్ద నిర్మాణ పనులు చేపడుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయింది. దీంతో సొరంగంలో 100 మంది చిక్కుకుపోయారు.
ఈ సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపడుతుండగా మిగిలిన భాగం వారిపై కూలిపోయింది. దీంతో మరో 100 మంది కూడా మృత్యువాతపడ్డారు. అంతేగాక, రేడియో ధార్మిక లీకేజీ కూడా సంభవించిందని సమాచారం.
అయితే, ఈ పెను ప్రమాదంపై ఇప్పటివరకు ఉత్తర కొరియా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబ్ను పరీక్షించడంతో ఆ ప్రదేశం మొత్తం దెబ్బతింది. దీంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని జపాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.