వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశ ద్రోహం: ప్రజల మధ్యలోనే ఉత్తర కొరియా రక్షణ మంత్రికి ఉరి
సియోల్: తమ దేశ రక్షణ శాఖ మంత్రిని దేశ ద్రోహం నేరం కింద బహిరంగంగా ఉరితీయించింది ఉత్తర కొరియా. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన నిఘా వర్గాలు వెల్లడించాయి. ప్యాంగ్యాంగ్లోని ఓ సైనిక పాఠశాల ఆవరణలో వందలాది మంది ప్రజలు చూస్తుండగానే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్తో రక్షణ మంత్రి హ్యూంగ్ యాంగ్ ఛోల్ను ఉరితీశారు.
ఈ ఘటన ఏప్రిల్ 30 ప్రాంతంలో జరిగినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఉత్తర కొరియాను పాలిస్తున్న కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలను సరిగా అమలు చేయకపోవడం, అతని పట్ల గౌరవం చూపకపోవడం లాంటి ఘటనల కారణాంగానే రక్షణ మంత్రికి ఉరివేశారని దక్షిణ కొరియా వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనకు సంబంధించిన విషయాలను బయటికి రాకుండా చూశారని పేర్కొన్నాయి. ఈ సంవత్సర కాలంలో 15మంది ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు ఇద్దరు ఉప మంత్రులను కూడా ఉరితీశారని తెలిపాయి.
Comments
English summary
North Korea has publicly executed the country's defense minister after the regime accused him of treason, according to reports from South Korea.
Story first published: Wednesday, May 13, 2015, 15:46 [IST]