మాతో పెట్టుకొంటే అమెరికా శవాలగుట్టే: ఉ.కొరియా వార్నింగ్
ప్యాంగ్యాంగ్: తమతో యుద్దం చేస్తే అమెరికా శవాల గుట్టగా మారుతోందని ఉత్తరకొరియా ప్రకటించింది.అమెరికా తన సమాధిని తానే తవ్వుకుంటోందని ఉత్తరకొరియా అధికారిక పత్రిక అయిన రోడాంగ్ విమర్శించింది.
అమెరికా తీరుపై ఉత్తరకొరియా అధికారిక పత్రిక రోడాంగ్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అమెరికా ఒకవైపు చర్చల పేరుతో శాంతిమంత్రం పఠిస్తూనే మరోవైపు రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందని విమర్శించింది.

అమెరికాను తుదముట్టించగలిగే హోడ్రోజన్ బాంబు ప్రయోగం విజయవంతమైందని దాంతో అమెరికాకు చెమటలు పడుతున్నాయని రోడాంగ్ విమర్శిస్తోంది. అమెరికాను తుదముట్టించేందుకు ఒక్క హోడ్రోజన్ బాంబు చాలునని రోడాంగ్ అభిప్రాయపడింది.
దక్షిణకొరియాను పావుగా వాడుకుని అమెరికా తమ దేశంపై దాడి చేసేందుకు పన్నాగలు పన్నుతోందని అవేవి ఫలించబోవని స్పష్టం చేస్తోంది. ఉత్తరకొరియాను ఎప్పుడూ ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడికి తాము ప్రయోగించే హోడ్రోజన్ బాంబు సమాధానం చెబుతుందని ప్రకటించింది.
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications