మాతో పెట్టుకొంటే అమెరికా శవాలగుట్టే: ఉ.కొరియా వార్నింగ్
ప్యాంగ్యాంగ్: తమతో యుద్దం చేస్తే అమెరికా శవాల గుట్టగా మారుతోందని ఉత్తరకొరియా ప్రకటించింది.అమెరికా తన సమాధిని తానే తవ్వుకుంటోందని ఉత్తరకొరియా అధికారిక పత్రిక అయిన రోడాంగ్ విమర్శించింది.
అమెరికా తీరుపై ఉత్తరకొరియా అధికారిక పత్రిక రోడాంగ్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అమెరికా ఒకవైపు చర్చల పేరుతో శాంతిమంత్రం పఠిస్తూనే మరోవైపు రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందని విమర్శించింది.
కిమ్కు ట్రంప్ షాక్: 'ఉ.కొరియాతో చర్చలొద్దు, ఆ తప్పులు నేను చేయను'
అమెరికాను తుదముట్టించగలిగే హోడ్రోజన్ బాంబు ప్రయోగం విజయవంతమైందని దాంతో అమెరికాకు చెమటలు పడుతున్నాయని రోడాంగ్ విమర్శిస్తోంది. అమెరికాను తుదముట్టించేందుకు ఒక్క హోడ్రోజన్ బాంబు చాలునని రోడాంగ్ అభిప్రాయపడింది.
దక్షిణకొరియాను పావుగా వాడుకుని అమెరికా తమ దేశంపై దాడి చేసేందుకు పన్నాగలు పన్నుతోందని అవేవి ఫలించబోవని స్పష్టం చేస్తోంది. ఉత్తరకొరియాను ఎప్పుడూ ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడికి తాము ప్రయోగించే హోడ్రోజన్ బాంబు సమాధానం చెబుతుందని ప్రకటించింది.