న్యూడ్ పెయింటింగ్ విలువ రూ. 1,131 కోట్లు
న్యూయార్క్: పికాసో లాంటి ప్రముఖుల పెయింటింగ్స్ కు దీటుగా ఓ న్యూడ్ పెయింటింగ్ అమ్ముడు పోయింది. న్యూయార్క్ లో నిర్వహించిన వేలం పాటలో చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్త అక్కడున్న అందరికి చుక్కలు చూపించి పెయింటింగ్ సొంతం చేసుకున్నాడు.
న్యూడ్ పెయింటింగ్ విక్రయించడానికి సోమవారం న్యూయార్క్ లో వేలం పాట నిర్వహించారు. నిర్వహకులు అనుకున్నట్లే పెద్ద సంఖ్యలో న్యూడ్ పెయింటింగ్ సొంతం చేసుకోవడానికి చాల మంది ప్రముఖులు వేలం పాట నిర్వహిస్తున్న ప్రాంతానికి వెళ్లారు.
అయితే నిర్వహకులు సైతం అశ్చర్యానికి గురైయ్యే విదంగా వేలం పాట జరిగింది. చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్త 170.4 మిలియన్ అమెరికా డాలర్లు (భారతీయ కరెన్సీ లో రూ. 1,131 కోట్లు) చెల్లించి ఆ న్యూడ్ పెయింటింగ్ సొంతం చేసుకున్నాడు.
గతంలో పికాసో గీసిన లెస్ ఫెమ్మెస్ డి అల్గర్ అనే పెయింటింగ్ భారతీయ కరెన్సీలో రూ. 1,189 కోట్లకు అమ్ముడయ్యింది. ప్రపంచ చరిత్రలో ఇదే అతి ఖరీదైన పెయింటింగ్. ఇప్పుడు ఈ న్యూడ్ పెయింటింగ్ ప్రపంచంలోనే అతి ఖరీదైన రెండవ పెయింటింగ్ గా రికార్డు నమోదు చేసింది.