మాతృత్వాన్ని వదిలి, మత్తుబాటలో తల్లిదండ్రులు
డ్రగ్స్ మత్తులో మానవత్వాన్ని మరిచిపోయారు స్వంత తల్లిదండ్రులు, రాత్రంతా డ్రగ్స్ మాయలోపడి , తెల్లవార్లు, తొమ్మిది నెలల ఇద్దరు పసికందులను కారులోనే వదిలేయడంతో పాటు ప్రపంచాన్ని సైతం మరిచి పోయారు. ఉదయం పోలీసులు వచ్చి కదిలించేవరకు కారులోనే పడుకుని ఉన్నారు ఆ జంట.
కవలలను కారులోని వదిలి మత్తులో జోగిన జంట
ఆమేరికా లోని ఫ్లోరిడాలో మానవత్వం మంటగలిచింది. చిన్న పిల్లలు ఉన్నారని కూడ చూడకూండ ఓ రెస్టారెంట్ భార్యభర్తలు విపరీతంగా డ్రగ్స్ తీసుకున్నారు. దీంతో కారులోనే స్పృహ లేకుండా పడుకున్నారు. అయితే విషాదమేటింటే వారికి తొమ్మిది నెలల కవలల తోపాటు ,మరో బాబు కూడ ఉన్నారు. ఇద్దరు కవలలను వెనక సీటులో వేశారు. ఇలా తెల్లవార్లు కారులోనే మత్తులో జోగారు.
ఉదయం రెస్టారెంట్ ఓపేన్ చేసేటప్పుడు చూసిన ఉద్యోగులు
కాగా ఉదయం రెస్టారెంట్ వద్ద షాపును ఓపేన్ చేసే సమయంలో ఓ పిల్లవాడు బట్టలు లేకుండా కారు వద్ద అటు ఇటు తిరుగుతున్నాడు.దీంతో పిల్లవాడిని గమనించిన ఉద్యోగులు పిల్లవాడి దగ్గరికి వెళ్లే సరికి పిల్లోడు వెంటనే కారును చూపించాడు. కారు వెనక సీట్లో ఇద్దరు కవలలు ,ముందు భాగంలో ఇద్దరు జంట మత్తులో పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం సిబ్బంది అందించారు
తల్లిదండ్రుల అరెస్ట్ , డ్రగ్స్ స్వాధీనం
సిబ్బంది సమాచారం తో స్పాట్ కు చేరుకున్న పోలీసులు కవలలను ప్రధమ చికిత్స అందించారు. పిల్లలు క్షేమంగా ఉండడంతో , ఇక మత్తు వదిలిన తర్వాత తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా భార్యభర్తలిద్దరు ఒహియోకు చెందిన వారుగా గుర్తించారు. అనంతరం కారులో లభ్యమైన డ్రగ్స్ ను సైతం స్వాదీనం చేసుకున్నారు.