వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతంపై బరాక్ ఒబామా వ్యాఖ్యలు: బాధపెట్టారని జిమ్ జిల్మోర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గురువారం నాడు ఐసిస్, క్రిస్టియన్ మతం పైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన వ్యాఖ్యల పైన విమర్శలు వినిపిస్తున్నాయి. మతం పేరిట జరిగే హింస ఇస్లాంకు మాత్రమే పరిమితం కాదని, క్రైస్తవంలోనూ ఉందని, క్రూసేడులు, ఇంక్విజిషన్‌ పేరిట జరిగిన హింసను ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేశారు.

వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో జరిగిన నేషనల్‌ ప్రేయర్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రసంగించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. వీటిపై పలువురు మండిపడుతున్నారు.

ఉదయం అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు.. తాను ఇంతకుముందు ఏ అధ్యక్షుడి నుండి వినలేదని మాజీ రిపబ్లికన్ గవర్నర్ ఆఫ్ వర్జీనియా జిమ్ జిల్మోర్ అన్నారు. తన వ్యాఖ్యల ద్వారా అమెరికాను, క్రిస్టియన్లకు మనస్తాపం కలిగించారని అభిప్రాయపడ్డారు.

కాగా, గురువారం వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో జరిగిన నేషనల్‌ ప్రేయర్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో బరాక్ ఒబామా ప్రసంగించారు.
మతంపై విశ్వాసం ప్రజలతో మంచి చేయిస్తుందని, అదే సమయంలో అదో ఆయుధంలా మారుతుందని అభిప్రాయపడ్డారు. మత అసహనం ఏ ఒక్క మతానికో, జాతికో చెందినది మాత్రమే కాదని, అందరిలోనూ ఉందన్నారు.

 Obama criticized for remarks on ISIS, Christianity

మతం పేరిట జరిగే హింస ఇస్లాంకు మాత్రమే పరిమితం కాదన్నారు. క్రైస్తవంలోనూ ఉందని వ్యాఖ్యానించారు. క్రూసేడులు, ఇంక్విజిషన్‌ పేరిట జరిగిన హింసను ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేశారు. మతం మంచికే అయినా కొందరు తాము చేసే ఘాతుకాల కోసం మతాన్ని హైజాక్‌ చేస్తారన్నారు.

ఈ మత అసహనం మత విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లాం కోసం యుద్ధం చేస్తున్నామనుకుంటున్న ఐఎస్ఐఎస్ నిజానికి ఇస్లాంను మోసం చేస్తోందన్నారు. ఈ సభకు హాజరైన టిబెట్‌ మత గురువు దలైలామాను ఒబామా.. మంచి స్నేహితుడుగా అభివర్ణించారు.

భారత్ పైనా... భారత దేశంలో ఇప్పుడు ఉన్న మత అసహనాన్ని చూసి ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ దిగ్భ్రాంతి చెంది ఉండేవారని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా భారత్‌లో అన్ని రకాల మత విశ్వాసాలు ఎదుర్కొన్న అసహన చర్యలను గాంధీ చూసి ఉంటే జీర్ణించుకోకపోయి ఉండేవారని అభిప్రాయపడ్డారు.

ఇటీవల భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సభలో మత సహనంపై తాను చేసిన వ్యాఖ్యలు అధికార భారతీయ జనతా పార్టీని ఉద్దేశించినవేననే విమర్శలు కొన్ని భారత రాజకీయ పార్టీలు చేశాయి. దీనికి వైట్ హౌస్ రెండు రోజుల క్రితం స్పందించింది. ఒబామా చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి కాదని పేర్కొంది. అనంతరం ఒబామా మరుసటి రోజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

English summary
US President Barack Obama may have thought he was giving a straightforward history lesson at the National Prayer Breakfast on Thursday when he compared the atrocities of the Islamic State to the bloodshed committed in the name of Christianity in centuries past.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X