అమెరికా ఎఫ్బీఐకి షాకిచ్చిన హ్యాకర్లు, చైనా చేసి ఉంటుందా?
వాషింగ్టన్: అమెరికా అధికారులకు హ్యాకర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఒక్కసారిగా కొలుకోలేని దెబ్బ కొట్టారు. రంగంలోకి దిగిన ఎఫ్బీఐ అధికారులు హ్యాకర్లు ఎక్కడి నుండి దాడి చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు. సైబర్ పోలీసులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇటీవల అమెరికా ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ నెట్ వర్క్ మీద హ్యాకర్లు దాడి చేశారు. ఫెడరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)కి చెందిన సుమారు 40 లక్షల మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, సమాచారం చోరీ చేశారు.
విషయం తెలుసుకున్న ఎఫ్బీఐ అధికారులు హడలిపోయారు. అమెరికాకు చెందిన ఎఫ్బీఐ విలువైన సమాచారాన్ని చైనా చోరీ చేసి ఉంటుందని అమెరికా భావిస్తోంది. చైనా మిలటరికి చెందిన హ్యాకర్లు ఈ నేరం చేసి ఉంటారని ఎఫ్బీఐ అధికారులు అంటున్నారు.
అమెరికా సాంకేతికంగా మరో సవాల్ ఎదుర్కోవడానికి సిద్దం అయ్యింది. వైరస్ మీద పోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యింది. ఎఫ్బీఐ అధికారులు, సైబర్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.