వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నా పేరు ఎవరూ పెట్టుకొవద్దు: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ యున్
న్యూఢిల్లీ: ఉత్తర కొరియా నియంతృత్వ సర్వసైన్యాధ్యక్షుడు కిమ్ జోంగ్ యున్ (31) తన పేరు ఎవరూ పెట్టుకోవద్దని ఆదేశాలు జారీ చేశాడు. కొత్తగా పుట్టే పిల్లలకు తన పేరు పెట్టరాదని, ఇప్పటికే తన పేరు కలిగిన వారు దాన్ని మార్చుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
జనన ధృవీకరణ పత్రాలు, ఇంటి పత్రాలు, తదితరాల్లో కూడా తన పేరు ఉన్నవారు వెంటనే మార్పించుకోవాలని ఆదేశించాడు. అంతేకాకుండా, తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాత కిమ్ ఇల్ సంగ్ పేర్లను కూడా నిషేధించాడు. ఈ వివరాలను దక్షిణ కొరియా ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది.
ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్-2 డిసెంబర్ 2011న రైలులో అధికార పర్యటనలో ఉండగా గుండెపోటుతో మరణించారు. తన తండ్రి మరణం తర్వాత పాలనా పగ్గాలు పగ్గాలు చేపట్టాడు కిమ్ జోంగ్ యున్. 1948లో స్వాతంత్యం పొందిన ఉత్తర కొరియా స్వతంత్ర దేశంగా ఏర్పడింది.
Comments
English summary
North Koreans cannot name their children Jong Un, and those who already share the name of the country's leader must change it. That's according to a directive from 2011 obtained recently by KBS, South Korea's state-run broadcast network.
Story first published: Thursday, December 4, 2014, 16:08 [IST]