వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త వివాదంకు తెరతీసిన పాక్: కర్తాపూర్‌లో 1971 యుద్ధం నాటి బాంబు ప్రదర్శన

|
Google Oneindia TeluguNews

కర్తాపూర్ : భారత్‌ను చెడ్డచేసి చూపేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా పాకిస్తాన్ తన కడుపుమంటను బయటపెడుతోంది. సిక్కుల పవిత్ర పుణ్యస్థలం కర్తాపూర్ గురుద్వారా ముందు పాకిస్తాన్ అప్పుడెప్పుడో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ గురుద్వారపై ఓ బాంబు జారవిడిచిందని పేర్కొంటూ పాకిస్తాన్ ఆ బాంబును ఓ గ్లాస్ కేసులో గురుద్వార ముందు ప్రదర్శించింది. శనివారం అధికారికంగా కర్తాపూర్ కారిడార్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సొంత పార్టీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే యుద్ధం .. వారి అంతు చూస్తా అంటున్న ఎమ్మెల్యే రజని సొంత పార్టీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే యుద్ధం .. వారి అంతు చూస్తా అంటున్న ఎమ్మెల్యే రజని

1971లో జరిగిన యుద్ధం సందర్భంగా కర్తాపూర్ ఆలయంను ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతో భారత్ బాంబుదాడి చేసిందని ఆ బాంబును ఓ గ్లాస్‌కేసులో ప్రదర్శిస్తూ పక్కనే ఓ పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. పోస్టర్‌లో ఇదంతా రాసి ఉంది. గురుద్వారాను ధ్వంసం చేయాలని భారత్ భావించినప్పటికీ అల్లాదయ వల్ల గురుద్వారాకు ఎలాంటి హాని కలగలేదని చెబుతూ భారత్‌లోని సిక్కులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్ జారవిడిచిన ఈ బాంబు పక్కనే ఉన్న శ్రీఖూసాహిబ్ అనే పవిత్రమైన బావిలో పడి పేలలేదని పోస్టర్‌పై రాసుకొచ్చింది. ఈ బావి నుంచే సిక్కు మతగురువు గురునానక్ దేవ్ నీళ్లు తోడుకుని పొలాల్లో పంట పండించేవారని చెప్పుకొచ్చింది.

 Pak rakes up fresh controversy:Exhibits 1971 bomb in front of Kartapur Gurudwara

ఇదిలా ఉంటే పాక్ పాల్పడిన ఈ చర్యపై భారత్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాకిస్తాన్ భారత్‌లో నివసిస్తున్న సిక్కుల మనోభావాలను దెబ్బతీసి ఇతర మతాల వారిపైకి ఉసిగొల్పి మతకల్లోలం సృష్టించే కుట్రపన్నిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం ప్రారంభంలో కూడా పాకిస్తాన మరో వివాదానికి తెరతీసింది. కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవంను పురస్కరించుకుని ఓ పాటను విడుదల చేసింది పాకిస్తాన్. అందులోని ఓ పోస్టర్‌లో ఖలిస్తాన్ వేర్పాటు వాది ఫోటోను చూపించింది.ఈ చర్యను ఖండించిన భారత అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ చర్యను చూస్తే ఖలిస్తాన్ వేర్పాటు వాదులను పాక్ ప్రోత్సహిస్తోందన్న విషయం అర్థమవుతోంది.
English summary
A day before the opening of the Kartarpur Corridor Pak raked up a fresh controversy by exhibiting a bomb that was used by India in 1971 war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X