పాకిస్థాన్ యూనివర్సిటీపై ఉగ్రదాడి: 9మంది మృతి, 32మందికి గాయాలు(వీడియో)
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాడి కలకలం రేపింది. పెషావర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోకి ముగ్గరు ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో 9మంది మృతి చెందగా, 32మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
UPDATE: Pakistani security forces were exchanging fire with the attackers of University of #Peshawar https://t.co/YnfZeAonoj pic.twitter.com/YGswsm8tv8
— RT (@RT_com) December 1, 2017
ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. విశ్వవిద్యాలయంలో వంద మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. గతంలో పెషావర్ పాఠశాలలో జరిగిన ఉగ్రదాడిలో 100మందికిపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే.