ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ గృహ నిర్బంధం పొడిగింపు
ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని మరో 30 రోజులు పొడిగించారు. అక్టోబర్ 24 తో ఆయన నిర్బంధ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ రో
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని మరో 30 రోజులు పొడిగించారు. అక్టోబర్ 24 తో ఆయన నిర్బంధ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఆ రోజు నుంచి మరో నెల రోజుల పాటు హఫీజ్ ఇంటికే పరిమితం కానున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ జ్యూడిషియల్ రివ్యూ బోర్డు గురువారం నిర్ణయించింది.
హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్ ఉద్ దవా (జేయూడీ)ని విదేశీ తీవ్రవాద సంస్థగా 2014లో అమెరికా గుర్తించిన సంగతి తెలిసిందే. జేయూడీ చీఫ్ సయీద్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది.
కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్, అతడి నలుగురు అనుచరులను 90 రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచాలని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఏడాది జనవరి 31న విధించిన ఈ గడువు తీరిన తర్వాత.. 'ప్రజా భద్రతా చట్టం' కింద వీరికి ఇప్పటివరకు రెండుసార్లు నిర్బంధాన్ని పొడిగించారు. తాజాగా హఫీజ్కు 30 రోజుల పాటు నిర్బంధం పొడించారు.
హఫీజ్తో పాటు గృహ నిర్బంధంలో ఉన్న మరో నలుగురి నిర్బంధ గడువు పొడిగించేందుకు మాత్రం బోర్డు తిరస్కరించింది. దీంతో సయీద్ అనుచరులు అబ్దుల్లా ఉబైద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుల్ రెహ్మాన్, ఖాజీ కాషిఫ్ హుస్సేన్లు స్వేచ్ఛా ప్రపంచంలోకి రానున్నారు.