వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా..కు భయపడి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఎత్తివేస్తున్న పాకిస్థాన్...

|
Google Oneindia TeluguNews

భారత దేశ ప్రతికార దాడులకు భయపడడంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడికొ తలొగ్గిన పాకిస్థాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఎత్తివేసినట్టు భారత భద్రతా దళాలు స్పష్టం చేశాయి.పీఓకేలోని గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న 11 శిబిరాలను ఎత్తివేసినట్టు ఇంటలీజెన్స్ వర్గాలు తెలిపాయి.

ప్రపంచదేశాల ఒత్తిడి.. ప్రతికార దాడులకు భయపడుతున్న పాక్

ప్రపంచదేశాల ఒత్తిడి.. ప్రతికార దాడులకు భయపడుతున్న పాక్

పూల్వామా దాడి తర్వాత భారత దేశం పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలతోపాటు , కశ్మీర్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈనేపథ్యంలోనే పుల్వామా దాడి తర్వాత బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరంపై సర్జికల్ స్ట్ర్రైక్ దాడి చేసింది. దీంతో వందలాదీ మంది ఉగ్రవాదులు నెలమట్టమయ్యారు.. ఈనేపథ్యంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ దేశ సపోర్ట్‌తో పాటు జైష్ ఏ మహ్మద్,లష్కర్ ఏ తోయిబా నిషేధిత తీవ్రవాద సంస్థలు ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నాయి. దీంతో వాటికి సంబంధించిన పక్కా ఆధారాలను ప్రపంచ దేశాలకు భారత్ అందించింది.

పీవోకేలో 11 ఉగ్రవాద శిక్షణ శిబిరాల ఎత్తివేత

పీవోకేలో 11 ఉగ్రవాద శిక్షణ శిబిరాల ఎత్తివేత

ఈనేపథ్యంలోనే ప్రపంచ దేశాల నుండి పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.దీనికి తోడు మరోవైపు భారత దేశం నుండి మరిన్ని సర్జికల్స్ స్ట్ట్రైక్స్ జరుగుతాయనే భయంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద శిబిరాలను గత కొద్ది నెలలుగా మూసివేస్తున్నాయి.ఇలా ఆక్రమిత కశ్మీర్‌లోని జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఏ తోయిబా నిషేధిత తీవ్రవాద సంస్థలు నిర్వహిస్తున్న సుమారు 11 శిక్షణ శిబిరాలను భారత ఇంటలీజేన్స్ వర్గాలు తెలిపాయి. కాగా పీవోకేలోని ముజఫరాబాద్,లొని అయిదు శిబిరాలను కోట్లీలోని మరో అయిదు శిబిరాలను మూసివేయగా బర్నాలా ప్రాంతంలో మరో ఉగ్రవాద శిబిరాన్ని మూసి వేశారు.

పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్‌పై ఒత్తిడి..

పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్‌పై ఒత్తిడి..

ముఖ్యంగా పుల్వామా అనంతరం పరిణామాల నేపథ్యంలో భారత్ ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపుతోంది. మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాకిస్థాన్‌‌ను ఒంటరి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలను చేసింది. ఈనేపథ్యంలోనే పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టు ఆధారలను సేకరించింది.మోడీ సైతం తన ప్రమాణ స్వీకారోత్సవానికి కనీసం ఆహ్వానం కూడ పంపించలేదు. మరోవైపు ఆదేశంతో ద్వైపాక్షిక సంబంధాలకు సైతం ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక పీవోకే వెంట కూడ భారత్ భారీగా దళాలను మోహరించింది. ఇక పాకిస్థాన్ సైతం సరిహద్దు వెంబడి ఉద్రిక్తలను తగ్గించాలని సైతం భారత్‌ను కోరింది.

English summary
fearing retaliation from India and under pressure from the international community, Pakistan has shut down terror camps on its soil, in the past few months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X