పాకిస్తాన్: బలూచిస్తాన్లో 11 మంది కార్మికుల తలలు నరికివేసిన ఇస్లామిక్ స్టేట్ - News reel
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఆదివారం ఉదయం జరిగిన దాడిలో 11 మంది షియా హజారాలు మరణించారు. ఈ దాడిని చేపట్టింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
దాడిని తామే చేపట్టినట్లు అమాక్ న్యూస్ ఏజెన్సీకి ఇస్లామిక్ స్టేట్ ఒక లేఖ రాసినట్లు రాయిటర్స్ తెలిపింది.
బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు 100 కి.మీ. దూరంలో బోలాన్ జిల్లాలో ఈ దాడి జరిగింది.
బొగ్గు గనిలో పనిచేస్తున్న 11 మంది కార్మికులు దాడిలో మరణించారని అధికారులు తెలిపారు.
కార్మికుల కళ్లు, చేతులకు గుడ్డలు కట్టి తలలు నరికేశారని ఓ భద్రతా అధికారి రాయిటర్స్కు చెప్పారు.
మైనారిటీ షియా వర్గాలపై ఇక్కడ దాడులు జరగడం కొత్తేమీ కాదు. గత ఏప్రిల్లో షియాలు ఎక్కువగా ఉండే మార్కెట్లో దాడిచేసి 18 మందిని హతమార్చారు.
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- కరోనావైరస్ లాక్డౌన్తో భారత్లో ఒక్కనెలలోనే నిరుద్యోగులుగా మారిన 12.2 కోట్ల మంది
నైజర్ దాడిలో 100కు పెరిగిన మృతుల సంఖ్య
పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్ దేశంలో రెండు గ్రామాలపై జరిగిన ఉగ్రదాడుల్లో మరణించిన వారి సంఖ్య వందకు పెరిగింది. ఇది ఇస్లామిస్ట్ మిలిటెంట్ల చర్యగా అనుమానిస్తున్నారు.
మృతుల సంఖ్య వందకు పెరిగినట్లు నైజర్ ప్రధాన మంత్రి బ్రిగి రఫీనీ సోమవారం తెలిపారు.
ఈ రెండు గ్రామాలు కూడా నైజర్కు పశ్చిమాన మాలీ సరిహద్దులకు దగ్గరగా ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో మిలిటెంట్ గ్రూపులు అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాయి.
కొన్నాళ్లుగా సహెల్ ప్రాంతంలో ఇస్లామిస్ట్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ నేతృత్వంలో వెస్ట్ ఆఫ్రికా, యూరోపియన్ కూటమి చర్యలు చేపడుతోంది.
అయినా కూడా ఆ ప్రాంతంలో మాదక ద్రవ్యాల రవాణా, మానవ అక్రమ రవాణా, జాతి హింస జరుగుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- తేనెలో కల్తీ: 'చైనీస్ షుగర్ సిరప్లను కలిపి, అమ్మేస్తున్నారు’
- లంచగొండి అధికారులను ఏసీబీ పట్టుకున్నాక ఏం జరుగుతుంది
- మోదీ ప్రభుత్వాన్ని రైతులు ఎందుకు నమ్మడం లేదు - కార్పొరేట్ సంస్థలంటే వారికి భయమెందుకు?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్కు సిద్ధంగా ఉంటాయా?
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)