ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ స్వర్గధామం: ఆక్స్ఫర్డ్ నివేదిక
ప్రంపంచ దేశాల్లో ఉగ్రవాదం ఒక్క పాకిస్తాన్లోనే ఎక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఉగ్రవాద సంస్థలకు సర్గధామంగా మారిందని పేర్కొంది. అంతర్జాతీయ భద్రతకు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రమాదంగా పరిణమించిందని నివేదిక తెలిపింది. సిరియాలో ఉన్న ఉగ్రవాదం కంటే పాకిస్తాన్లోని ఉగ్రవాదం మూడురెట్లు ఎక్కువగా ఉందని వెల్లడించింది.
ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న దేశాల్లో పాకిస్తాన్దే తొలిస్థానం
"హ్యూమానిటీ ఎట్ రిస్క్- గ్లోబల్ టెర్రర్ థ్రెట్ ఇండికెంట్" పేరుతో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ మరియు స్ట్రాటెజిక్ ఫోర్సైట్ గ్రూప్లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పాక్ బండారం బయటపడింది. అంతేకాదు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని కూడా రిపోర్ట్ వెల్లడించింది. అంతేకాదు సిరియాలో ఉంటే ప్రాణాపాయం ఎంతైతే ఉందో అంతకు మించి మూడురెట్లు ఎక్కువగానే ప్రాణాపాయం పాక్లో ఉందని నివేదిక వెల్లడించింది. అఫ్ఘాన్ తాలిబన్, లష్కరే తొయిబా సంస్థలు అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని వెల్లడించింది. ఉగ్రవాదుల స్థావరాలకు వారికి నివాసం కల్పిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ తొలిస్థానంలో నిలిచింది. అంతేకాదు పాకిస్తాన్ మద్దతుతో ఆఫ్ఘానిస్తాన్లో కూడా చాలా ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొంది.
ఎప్పుడూ యాక్టివ్గా పనిచేసే 200 ఉగ్రవాద సంస్థలు
ఉగ్రవాదం, ఉగ్రవాదంపై అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో 80 పేజీలతో కూడిన నివేదికను ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అతివాదం, ఆయుధాలు వినియోగంతో ఆర్థకి వ్యవస్థను దెబ్బతీయడం తద్వారా అభివృద్ధిని అడ్డుకోవడం ఇప్పటి నుంచి 2030 వరకు కొనసాగుతుందని... వీటన్నిటికీ ఉగ్రవాద మూలాలు ఉంటాయిని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే ఒక 200 ఉగ్రవాద సంస్థలు వ్యవస్థను నాశనం చేసేందుకు ఎప్పుడూ పనిచేస్తున్నాయని స్ట్రాటెజిక్ ఫోర్సైట్ గ్రూపు పేర్కొంది.
గత ఐదేళ్లుగా మీడియాలో నానిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ
ఎక్కువగా
ఉగ్రవాదంను
ఆకర్షిస్తున్నసంస్థల్లో
ఐసిస్
ముందు
వరసలో
ఉంది.
గత
ఐదేళ్లుగా
ఐసిస్
మీడియాలో
నానుతోంది.
అయితే
ఐసిస్
కూడా
ఆటుపోట్లను
ఎదుర్కొంటుండగా
ఆల్
ఖైదా
మాత్రం
యాక్టివ్
పాత్ర
పోషిస్తోంది.
2011
వరకు
ఆల్ఖైదాను
ఒసామా
బిన్
లాడెన్
నడిపించగా
ఆయన
మృతి
తర్వాత
అతని
కొడుకు
హమ్జా
బిన్
లాడెన్
నడిపిస్తున్నాడు.
ఆల్ఖైదా
పాకిస్తాన్లో
పుట్టినప్పటికీ...పాక్
ఆక్రమిత
ఆఫ్ఘానిస్తాన్లోకి
మకాం
మారింది.
పాకిస్తాన్లోని
అబోటాబాద్
ఒసామా
బిన్
లాడెన్కు
స్వర్గధామంగా
నిలిచింది.
అదికూడా
పాకిస్తాన్
మిలటరీ
ఏరియాకు
కూతవేటు
దూరంలో
ఉంది.
ఒక్క
కాంపౌండే
చాలా
పెద్దదిగా
ఉంటుంది.
అదే
కాంపౌండ్లో
లాడెన్
కుటుంబం
నివసించేది.