పాక్ ఆక్రమిత కాశ్మీర్పై పట్టున్న జావెద్ బజ్వా పాక్ ఆర్మీ కొత్త చీఫ్
పాకిస్తాన్ ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావెద్ బాజ్వా నియమితులయ్యారు. చీఫ్ ఆర్మీ స్టాఫ్గా ఆయనను నియమిస్తూ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం నాడు ఆదేశాలు ఇచ్చారు.
కరాచీ: పాకిస్తాన్ ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావెద్ బాజ్వా నియమితులయ్యారు. చీఫ్ ఆర్మీ స్టాఫ్గా ఆయనను నియమిస్తూ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం నాడు ఆదేశాలు ఇచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో వ్యవహారాలను చక్కబెట్టడంలో ఇతనికి మంచి అనుభవం ఉంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు ఉత్తర ప్రాంతాల వ్యవహారాలపై మంచి పట్టున్న వాడు ఖమర్ జావెద్ బజ్వా. ఇతను బెలూచ్ రెజిమెంట్కు చెందిన వాడు. ఉత్తరాది ప్రాంతంలో అతను చీఫ్ ఆఫ్ ఫోర్స్ కమాండర్గా పని చేశారు. జనరల్ రహీల్ నుంచి బజ్వా మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తారు.
ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రహీల్ తాను పదవీ పొడిగింపును కోరుకోవడం లేదని నిర్ణీత తేదీకే విరమణ పొందుతున్నానని గతంలోనే ప్రకటించారు. పాకిస్తాన్లో అత్యంత కీలకమైన ఈ పదవికి ఆయననే కొనసాగిస్తారన్న ఊహాగానాలూ ఇటీవల వినిపించాయి. వాటికి తెర దించుతూ కొత్త సైన్యాధిపతిని నియమించారు.
మరోవైపు, సిబ్బంది కమిటీ అధిపతి (సీజేసీఎస్సీ)గా లెఫ్టినెంట్ జనరల్ జుబైర్ హయత్ను నియమితులైనట్లు పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ తెలిపారు. అయిదోసారి సైన్యాధిపతి నియామకం జరిపిన పాక్ ప్రధానిగా షరీఫ్ ఘనతను సాధించారు.