మోడీకి అభినందనలు తెలిపిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందా.. ?
భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ప్రధాని మోడీకి పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ అభినందనలు తెలిపారు. ఈనేపథ్యంలోనే రెండు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే దక్షిణాసియా దేశాల్లో శాంతిని నెలకొల్పి అభివృద్దివైపు అడుగులు వేసేందుకు సహకరించాల్సింగా ఆయన కోరారు.
భారత దేశంలో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో పుల్వామా దాడీ జరగడం తిరిగి భారత వైమానిక దళాలు బాలకోట్ ఎయిర్ స్ట్ర్రైక్ జరిగింది... ఈనేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తిరిగి మోడీ ప్రభుత్వం ఎర్పడితినే రెండు ప్రభుత్వాల మధ్య సానుకూల పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. మోడీ గెలవడం వల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతోపాటు బాలకోట్ ఎయిర్ స్ట్ర్రైక్ తర్వాత జరిగిన దాడిలో పట్టుపడ్డ కమాండర్ అభినందన్ను సైతం యుద్ద ఖైదీల చట్టాలను అనుసరించి భారత్కు అప్పగించాడు. దీంతో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీకి సానుకూల పవనాలు ఏర్పాడ్డాయి. అభినందన్ విడుదలను దేశం మొత్తం ఉత్కంఠ ఎదురుచూసింది..
మోడీకి అంతకుముందు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడ ప్రధాని నరేంద్రమోడీకి అభినందనలు తెలిపారు.