కశ్మీర్ అంబాసిడర్గా మారుతా...! ప్రపంచమంతా తిరుగుతా : ఇమ్రాన్ ఖాన్
కశ్మీర్ అంబాసిడర్గా ప్రపంచమంతా పర్యటిస్తానని మరోసారి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.శుక్రవారం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గోన్నారు. ప్రపంచ దేశాలకు మోడీతోపాటు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో వివరిస్తానని అన్నారు. దీంతో పాటు కశ్మీర్ అంతర్జాతీయ సమస్యగా ఆయన అభివర్ణించారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రతి శుక్రవారం కశ్మీర్ అవర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కశ్మీరీలకు మద్దతుగా ప్రతి ఒక్కరు నిలబడాలని ఆయన పిలుపునిచ్చాడు. దీంతో పీఓకేలో నిర్వహించిన సభలో ఆయన పాల్గోన్నారు. భారత దేశం వేలాది మందిని అదుపులోకి తీసుకోవడం ద్వార ప్రజలను ఉగ్రవాదంలోకి నెట్టివేస్తున్నారని అయన పేర్కోన్నారు.
దీంతో ప్రజల్లో భారత దేశంపై వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు.కశ్మీర్ సమస్య కేవలం భారతీయుల ముస్లింలే కాదని ప్రపంచ వ్యాప్తంగా 1.25 బిలియన్ ముస్లింలు కశ్మీర్లో జరిగే పరిణామాలను పరీశీలిస్తున్నారని అన్నారు. కాగా కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి పాకిస్థాన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..