రూ.3.57 కోట్ల నుంచి రూ.47 లక్షలకు పడిపోయింది: మూడేళ్లలో భారీగా తగ్గిన ఇమ్రాన్ ఖాన్ ఆదాయం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదాయం గత మూడేళ్లలో పెద్ద మొత్తంలో తగ్గింది. ఈ తగ్గుదల రూ.3కోట్లకు పైగా ఉంది. ఈ మేరకు సోమవారం పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అతని వార్షికాదాయం 2015లో రూ.3.56 కోట్లుగా ఉంది. 2016 నాటికి రూ.1.29 కోట్లకు పడిపోయింది.
లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తా, నన్నూ లాగారు.. కపిల్ సిబాల్పై దావా వేస్తా: కిషన్ రెడ్డి
ఇమ్రాన్ ఖాన్ ఆదాయం 2017లో రూ.47లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని డాన్ పత్రిక ప్రచురించింది. అదే సమయంలో ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ ఆదాయం బాగా పెరిగింది.
మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆదాయం కూడా పెరిగింది. 2010లో ఆయన వ్యవసాయ ఆదాయమే రూ.10.5కోట్లు. 2017నాటికి 13.4 కోట్లకు చేరుకుంది. అసిఫ్ అలీ జర్దారీ ఆధీనంలో దాదాపు ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది. సంపదపరంగా చూస్తే బిలావల్ భుట్టో జర్దారీ ఎక్కువ సంపన్నుడు.