పాకిస్తాన్కు భారీ షాక్ - టెర్రరిస్టుల కట్టడిలో ఫెయిల్ - ఇంకా ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులోనే..
ఉగ్రవాదుల కార్ఖానాగా పేరుపొందిన పాకిస్తాన్ లో అంతర్జాతీయ ఆంక్షల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. పాక్ లో ఇప్పటికీ పలు రూపాల్లో ఉగ్రకలాపాలు కొనసాగుతున్నాయని, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగా ''ప్రపంచ ఉగ్రవాద నియంత్రణా సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) సూచించిన ఆరు ప్రమాణాలను పాక్ పాటించలేదు. దీంతో.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆంక్షలను పొడగించారు.
మోదీ, షా చెప్పినా జగన్ వినలేదు - సోము వీర్రాజు ఫైర్- ఏపీలో సంక్షోభం -కేంద్రమే దిక్కన్న బీజేపీ నేతలు
మరోవైపు భారత్ సైతం పాకీస్తాన్లోని ఇస్లామాబాద్లో ఉగ్రవాదులను ఉంచిందని, వారికి కావలసిన సదుపాయాలను చేస్తోందిని పాకిస్తాన్ను నిలదీసింది. దాంతో పాటు డ్రోన్ల ద్వారా ఆయుధాలను కూడా సరఫరా చేస్తుందని చెప్పింది. అంతేకాకుండా సీజ్ ఫైర్ వయలేషన్ (సీఎఫ్వీ)ను ఒక్క ఏడాదిలో 3800 సార్లు అతిక్రమించిదని, వాస్తవాధీన రేఖకు చేరువలో ప్రజాప్రాంతాల్లో ఆయుధాలను మరిన్ని ఇతర వస్తువులను పడేసిందిన భారత్ వెల్లడించింది.
ప్రస్తుతం ఎఫ్ఏటీఎఫ్ జాబితాలో పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉందని, ఇస్లామాబాద్ వంటివి గ్రే లిస్ట్ నుంచి బయటకు రాకూడదని భారత్ సూచించింది. అయితే ఎఫ్ఏటీఎఫ్ పెట్టిన నిబంధనలను పూర్తి చేయని దేశాలను గ్రే లిస్ట్లో ఉంచుతారు. పాకిస్తాన్ వంటి దేశాలు అందులోనే ఉండాలని భారత్ కోరింది. పాకీస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తుందని, మసూద్ అజార్, దావూద్ ఇబ్రహిమ్, జాకిర్ ఉర్ రెహ్మాన్ లాఖ్వి మొదలైన వారికి రక్షణ కల్పించి పాక్ ఉగ్రవాదాన్ని బలోపేతం చేసిందని భారత్ తెలిపింది.
స్నేహం పరువు తీసిన ట్రంప్ - గోడ కట్టినా 'కంపు ఇండియా' దాగలేదు - 'హౌడీ మోడీ' ఫలితమంటూ