వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు రైళ్లు ఢీ: 16మంది మృతి, 40మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని కరాచీలో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లండి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో రెండు ప్యాసెంజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గడాఫీ ప్రాంతంలో వెళ్తున్న జకారియా ఎక్స్ప్రెస్కు తప్పుడు సిగ్నల్ రావడంతో ఎదురుగా వస్తున్న ఫరీద్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదం కారణంగా కరాచీ నుంచి మిగతా మార్గాల్లో రైళ్ల రాకపోకలను అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రైళ్ల మధ్యలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
Comments
English summary
At least 16 people were killed and 40 others injured in Pakistan after two passenger trains collided. Three bogies of Zakaria Express were completely destroyed due to the collision in Gaddafi Town in Landhi area early morning.