తొలిరాత్రి: కన్య కాదని నవ వధువును హత్య చేశాడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జకోబాబాద్ జిల్లా సింధు ప్రొవిన్స్లో ఓ యువ జంటకు ఘనంగా పెళ్లి జరిగింది. అయితే వారి తొలి రాత్రే నూతన వరుడు రాక్షసుడిలా మారిపోయాడు.
శోభనం రాత్రి గదిలోకి వెళ్లిన నవ వధువును హత్య చేశాడు ఆ నూతన వరుడు. ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
వివరాల్లోకి వెలితే.. పాకిస్థాన్లోని జకోబాబాద్లో ఖాన్జాదీ లసారీ(19) అనే యువతికి, కలందర్ భక్షు(28) అనే యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి రోజు రాత్రి తన భార్య శీలవతి కాదని ఆరోపిస్తూ ఆమెను హత్య చేశాడు కలందర్.
ఈ హత్యకు భక్షు నలుగురు సోదరులు సహకరించడం మరో దారుణం. కాగా, లసారీ కుటుంబం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భక్షును అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.