వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సురక్షితంగా చేర్చినందుకు ‘థాంక్యూ‘: పైలట్‌కు ప్రయాణికురాలి లేఖ

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: విమానంలో ప్రయాణించిన ఓ ప్రయాణికురాలు తమను క్షేమంగా గమ్యాన్ని చేర్చినందుకు విమాన పైలట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖ రాసింది. అది ట్విట్టర్లో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. బెతనీ అనే ప్రయాణికులు కొద్ది రోజుల క్రితం తను ప్రయాణించిన విమాన పైలట్‌కు ‘థాంక్యూ' అని ఓ లేఖ రాసింది.

ఇటీవల జర్మనీకి చెందిన జర్మన్ వింగ్స్ విమానం.. కో పైలట్ కావాలని ఆ విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాలకు ఢీకొట్టడంతో ప్రయాణికులందరూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 150మంది ప్రయాణికులు మరణించారు.

 Passenger's ‘Thank You’ note to pilot goes viral

కాగా, నేపథ్యంలో ఓ విమానంలో ప్రయాణించిన బెతనీ రాసిన లేఖను జై దిల్లన్ అనే మహిళ ట్విట్టర్లో పోస్టు చేసింది. తన ఫ్యామిలీ వద్దకు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న తనను సురక్షితంగా చేరుస్తారని పైలట్‌పై నమ్మకంముందని ఆ లేఖలో బెతనీ పేర్కొంది.

సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనవాళ్లను కలుసుకుంటామని తెలిపింది. ‘నేను ఈ రాత్రి నవ్వుతానంటే అందుకు నీవే కారణం' అని పైలట్‌కు రాసిన లేఖలో పేర్కొంది. కాగా, ఈ లేఖ ట్విట్టర్లో చాలా మంది వీక్షిస్తున్నారు.

English summary
An airlines passenger's heart-warming letter to the pilot of the flight she was traveling home is actually breaking the internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X