వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పఠాన్‌కోట్ దాడి వెనుక షాక్:మోడీ పాక్ టూర్‌తో లింక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పైన ఉగ్రవాదుల దాడిలో భారత్ ఏడుగురు ధీశాలులను కోల్పోయింది. పఠాన్‌కోట్ దాడి వెనుక... ఎన్నో కారణాలు ఉన్నాయంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి. భారత్ - పాక్ మధ్య శాంతియుత చర్చలు జరగకుండా చేయడంలో భాగంగానే ఈ దాడులు జరిగాయని భావిస్తున్నారు.

ఇందుకు సంబంధించి ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్, పాకిస్తాన్ ఇంటర్ సెర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కలిసి పఠాన్‌కోట్ పైన తీవ్రవాద దాడికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

సమాచారం మేరకు... భారత్ - పాకిస్తాన్‌ల మధ్య శాంతియుత చర్చల విషయంలో రహీల్ షరీఫ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అకస్సాత్తుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు సందర్భంగా లాహోర్‌లో పర్యటించారు.

Pathankot Terror Attack: Revealed! How was it linked with Modi's surprise visit to Pakistan

ఇరువురు ప్రధానులు శాంతియుతంగా ముందుకు సాగేందుకు సిద్ధమైనట్లుగా భావించిన ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్.. దానిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా తీవ్రవాద దాడికి ప్లాన్ చేశాడని అంటున్నారు.

పాకిస్తాన్‌లోని రావల్పిండిలో తీవ్రవాద దాడికి ప్లాన్ చేశారు. తద్వారా త్వరలో జరగనున్న ఇరు దేశాల కార్యదర్శుల సమావేశాన్ని కూడా భగ్నం చేయాలని వారి లక్ష్యంగా చెబుతున్నారు. ఈ దాడికి బాధ్యులమంటూ జిఈఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
India lost seven of its bravehearts during the terror attack at Indian Air Force (IAF) base in Pathankot, Punjab. Now, it has been reported that the terror attack might have carried out to derail the peace talks between India and Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X