పెన్సిల్వేనియా ఎందుకు కీలకం: 2016 కంటే ఓటింగ్ ఎందుకు పెరుగుతోంది.. కారణమిదేనా..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియో కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ ఓట్లు అధ్యక్షుడు ట్రంప్నకు కచ్చితంగా అవసరం. అయితే సోమవారం పెన్సిల్వేనియాలో నల్ల జాతీయుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నిరసనలు మిన్నంటాయి. రెండురోజుల తర్వాత బుధవారం ఫిలడెల్పియాలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
అల్లర్ల అంశాన్ని ట్రంప్-బిడెన్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లర్ల వెనక బిడెన్ ఉన్నారని ట్రంప్ ఆరోపించారు. విస్కాన్సిన్ ర్యాలీలో ట్రంప్ విరుచుకుపడ్డారు. అయితే ఘటనను జో బిడెన్ కూడా ఖండించారు. పెన్సిల్వేనియాలో తాము విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు. ఇక్కడ బిడెన్ కోరితే విరాళాలు కూడా ఎక్కువ ఇవ్వడం విశేషం. దీంతో ఈ సారి రాష్ట్రంలో ట్రంప్-బిడెన్ మధ్య హోరాహోరీగా పోరు జరగనుంది.
రాష్ట్రంలో 3.5 మిలియన్ ఓటర్లు ఉన్నారు. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో చాలా మంది బ్యాలెట్ పంపించలేదు. దీంతో ఓటింగ్ శాతం తగ్గింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ 44 వేల 292 ఓట్లతో విజయం సాధించారు. ఈ సారి ఓటింగ్ శాతం పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది.
Recommended Video
ఫిలడెల్పియాలో నల్ల జాతీయుడు చనిపోవడంతో పెన్సిల్వేనియాలో ముందస్తు ఓటింగ్ పెరిగింది. రెండు నంచి 3 మిలియన్ బ్యాలెట్లను పంపించారు. ఎన్నికలకు వారం రోజుల కన్నా ముందు.. పరిస్థితి మారుతోంది. గతంలో కన్నా ఎక్కువ శాతం ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది.