పెరూలో భారీ భూకంపం .. 7 తీవ్రతతో ప్రకంపనాలు ... సునామీ వచ్చే అవకాశం
పెరూ : దక్షిణ అమెరికాలోని పెరూలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. మధ్య పెరూలో తీవ్రత ఎక్కువగా ఉంది. భూ కంప తీవ్రత 7.3గా నమోదైంది. తర్వాత తగ్గుతూ 7కి చేరింది. పెరూకి 11 కిలోమీటర్ల దూరంలో గల అజాంగరో వద్ద కూడా భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నది. భూకంప తీవ్రత ఎక్కువ ఉండటంతో బ్రెజిల్, బొలివియా, చిలీ దేశాలకు ప్రకంపనాలు వ్యాపించినట్టు అమెరికా జియోలాజికల్ అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపంతో ఇప్పటివరకు ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు. పెరూలో భూకంపం వచ్చి తర్వాత .. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు.
సునామీ వచ్చే అవకాశం
పెరూలో వచ్చిన తీవ్ర భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు. భూకంప తీవ్రత తగ్గుతూ ఉండటంతో సునామీ రాకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. హవాలి ద్వీపానికి కూడా సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు స్పష్టంచేశారు.
ఢిల్లీలో భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదు
2007లో 8 తీవ్రతతో భూకంపం
ఇప్పటి పరిస్థితి ఇలా ఉంటే .. 2007లో వచ్చిన భూకంపం పెరూను అతలాకుతలం చేసింది. 8 తీవ్రతతో వచ్చిన భూకంపంతో దాదాపు 600 మంది మృతిచెందారు. ఆ నాటి ఘటనను గుర్తుచేసుకొని .. గజ గజ వణికిపోతున్నారు ప్రజలు.
మధ్యప్రదేశ్ లో కూడా భూకంపం
ఇటు మధ్యప్రదేశ్ లో కూడా భూకంపం వచ్చింది. శుక్రవారం 4.6 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని సింగ్రౌలీగా గుర్తించారు. 10 కిలోమీటర్ల మేర ప్రభావం చూపించిందని అధికారులు తెలిపారు. భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.