పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: రైతులకు చేరాల్సిన సొమ్ము ఆదాయపు పన్ను కట్టేవారి ఖాతాల్లో ఎందుకు పడుతోంది?
రైతులకు లబ్ధి చేకూర్చేందుకు భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల్లో 28 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు ఇటీవల సమాచార హక్కు చట్టం కింద చేసిన ఓ దరఖాస్తు ద్వారా బయటపడింది.
ఈ 28 లక్షల మందిలో 55 శాతం మంది, అంటే 11.38 లక్షల మంది ఆదాయపు పన్ను కడుతున్నవారే.
నిజానికి ఆదాయపు పన్ను కట్టేవారికి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించదు. అయినా, ఇంత మంది ఎలా ప్రయోజనం పొందగలిగారన్నది చర్చనీయాంశంగా మారింది.
అనర్హులకు మొత్తంగా రూ.1,364 కోట్ల మేర లబ్ధి జరిగిందని సమాచార హక్కు (సహ) చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు స్పందిస్తూ కేంద్ర వ్యవయసాయశాఖ వెల్లడించింది.
పథకంలో పెట్టిన అర్హత ప్రమాణాలను చేరుకోని వారు లబ్ధిదారుల్లో 44.41 శాతం మంది ఉన్నారని కూడా పేర్కొంది.
కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ప్రొగ్రామ్ హెడ్ వెంకటేశ్ నాయక్ ఈ సహ దరఖాస్తు చేశారు.
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది
ఆధార్ ఇచ్చినా...
ఈ పథకం లబ్ధిదారులు ప్రభుత్వానికి ఆధార్ సంఖ్య తెలియజేయడం తప్పనిసరి. మరోవైపు ప్రభుత్వం దగ్గర ఆదాయపు పన్ను చెల్లించేవారి మొత్తం సమాచారం ఉంటుంది.
దీంతో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారి సమాచారం తెలిసి కూడా ప్రభుత్వం ఈ పథకం కింద ప్రయోజనం ఎందుకు కల్పించిందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
''ప్రభుత్వం దగ్గర పన్ను చెల్లింపుదారుల వివరాలన్నీ ఉంటాయి. ఆధార్, పాన్ కార్డు కూడా అనుసంధానమై ఉంటాయి. 2018లో ఆధార్ విషయమై సుప్రీం కోర్టు తీర్పునిస్తూ... ఆధార్ వెల్లడి 'స్వచ్ఛందమని చెప్పింది. కానీ, ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలు, సేవలు పొందడానికి మాత్రం ఇది తప్పనిసరి అని పేర్కొంది. ప్రైవేటు రంగానికి మాత్రం ఆధార్ను వినియోగించుకునే అనుమతి ఇవ్వలేదు’’ అని వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ చెప్పారు.
''పీఎం కిసాన్ పథకం కింద వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రయోజనం దక్కుతుంది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఆదాయపు పన్ను సమాచారంతో సరిపోల్చి, అనర్హులను ప్రభుత్వం ఏరివేయడం సాధ్యమయ్యే పనే’’ అని ఆయన అన్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ లబ్ధిదారుల్లో రెండు రకాల వాళ్లు ఉన్నారని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఒకటి ఆదాయపు పన్ను చెల్లించేవారు. రెండు అర్హత ప్రమాణాలను అందుకోనివారు.
ప్రభుత్వం చెబుతున్నదాని కన్నా, పథకంలోని అనర్హుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందని వెంకటేశ్ నాయక్ అంటున్నారు.
''ఇందులో సామాన్య ప్రజల కన్నా ప్రభుత్వం తప్పే ఎక్కువ. జనంలో చాలా మందికి అసలు అర్హత ప్రమాణాలు ఏంటో తెలియవు. ప్రభుత్వ అధికారులకు నియమనిబంధనలు అన్నీ తెలుసు. అయినా, వారు సరిగ్గా పనిచేయలేదు. అనర్హులు స్వయంగా డబ్బును వెనక్కిఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ, అది సాధ్యపడలేదు. మహమ్మారి సమయంలో జనం ఆదాయం కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు అనర్హులను పేర్లను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని ఆయన అన్నారు.
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- రైతుల ఆందోళన: నెల రోజులు గడిచినా ఉద్యమాన్ని ఎలా కొనసాగించగలుగుతున్నారు?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఐదు ఎకరాల (రెండు హెక్టార్ల) లోపు భూమి ఉన్న రైతులకు ఒక్కొక్కరికీ ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తారు.
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు, పది వేల రూపాయలకు పైగా పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.
2019లో కేంద్రం ఈ పథకం తెచ్చింది.
అయితే, ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమవ్వకుండానే ఈ పథకం తీసుకువచ్చిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
2019-20 మధ్యంతర బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఈ పథకం గురించి కేంద్రం ప్రకటించింది. 2018 డిసెంబర్ 1న దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
''ప్రభుత్వం తొందరపాటుతో ఈ పథకం మొదలుపెట్టింది. ఎన్నికలకు ఒక నెల ముందు దీన్ని ప్రారంభించింది. దీంతో ఎవరు లబ్ధిదారులు, ఎవరు కారన్నదానిపై అధికార యంత్రాంగం పెద్దగా దృష్టి పెట్టలేదు. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో అనర్హులు లబ్ధి పొందారు. ఈ పథకంలో కౌలు రైతులను పూర్తిగా విస్మరించారు. ఇది చాలా పెద్ద లోపం. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది’’ అని వెంకటేశ్ నాయక్ అన్నారు.
అయితే, కౌలు రైతులను ఈ పథకం పరిధిలోకి తేవడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం. వారి సమాచారాన్ని ధ్రువీకరించుకోవడంలో ప్రభుత్వానికి అనేక చిక్కులు ఎదురవుతాయి.
మోదీ ప్రభుత్వం ఈ పథకం కోసం ఏటా రూ.75 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
ఇటీవల విడుదల చేసిన రూ.18 వేల కోట్లతో కలిపి ఇప్పటివరకూ రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1.10 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
తాను సహ దరఖాస్తు చేసేటప్పటికి ఈ పథకం కింద 9-9.5 కోట్ల మంది లబ్ధిదారులున్నారని, ఇప్పుడు వారి సంఖ్య పది కోట్లు దాటిందని వెంకటేశ్ నాయక్ అన్నారు.
- బంగ్లాదేశ్లో భారీగా పడిపోయిన వరి దిగుబడి.. దీని వల్ల భారత్కు మేలు జరుగుతుందా?
- నియంత్రిత సాగుపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట మార్చారు? ప్రభుత్వం పంటలను కొనకపోతే వచ్చే సమస్యలేంటి?
'నెలవారీ డేటా విడుదల చేయాలి’
''పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి నెలవారీ డేటా విడుదల చేయాలి. అప్పుడే పరిశోధకులు అధ్యయనం చేసి సలహాలు, సూచనలు చేసేందుకు వీలు కలుగుతుంది’’ అని సిరాజ్ హుస్సేన్ అన్నారు.
మొదట్లో అనర్హులు కూడా ఈ పథకంలో చేరిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఉత్తర్ప్రదేశ్లోని ఓ ఊరిలో ప్రజా సేవా కేంద్రాన్ని నడుపుతున్న సత్యేంద్ర చౌహాన్ అన్నారు.
''మొదట్లో అందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసేవారు. పెద్దగా పరిశీలన లేకుండానే, వాటికి ఆమోదం లభించింది. అప్పట్లో వ్యవసాయ శాఖ ఒక్కటే ఈ పని చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని సరిగ్గా ఉంటేనే, వ్యవసాయ శాఖ వరకూ పత్రాలు వెళ్తున్నాయి’’ అని అన్నారు.
దరఖాస్తు ఆమోదం పొందిన మూడు, నాలుగు నెలల తర్వాతే డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడతాయని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- సిరాజ్పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- 'అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- బెడిసికొట్టిన ఆస్ట్రేలియా స్లెడ్జింగ్... అసలు ఆ జట్టు సంస్కృతి మారదా?
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- 'ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
- మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- దేశ విభజన సమయంలో కరాచీలో హిందువులను, సిక్కులను ఎలా ఊచకోత కోశారు.. ఆస్తులను ఎలా లూటీ చేశారు
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)