రెహామ్ ఖాన్ అభ్యంతర ఫోటోలు పెడదామంటే నో చెప్పిన షరీఫ్
కరాచీ: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సతీమణి రెహామ్ ఖాన్ను లక్ష్యంగా చేసుకుందామనుకున్న తమ పార్టీ నాయకుల పైన పాకిస్తాన్ ప్రధాని, పీఎంఎల్(ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ రెండు రోజుల క్రితం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.
ఇమ్రాన్ ఖాన్ను టార్గెట్ చేసుకునేందుకు రెహామ్ ఖాన్ను ఉపయోగించుకుందామని, ఆమెకు చెందిన అభ్యంతరకర ఫోటోలను సోషల్ మీడియాలో పెడదామని పార్టీకి చెందిన పలువురు షరీఫ్కు సూచించారు. దీనిపై షరీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
పీఎంఎల్(ఎన్)కు చెందిన పలువురు నాయకులు పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ను టార్గెట్ చేసుకునేందుకు ఆయన భార్య రెహామ్ ఖాన్ అభ్యంతరకర ఫోటోలు ఉపయోగించుకుందాని ప్రతిపాదన తీసుకు వస్తే షరీఫ్ వద్దని చెప్పారని, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఓ నేత చెప్పారు. ఇలాంటి నెగిటివ్ అంశాల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారని చెప్పారు. పాజిటివ్గా వెళ్లాలని సూచించారన్నారు.