వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ల్యాండవుతూ కుప్పకూలిన విమానం: 12మంది మృతి

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: కొద్ది నిమిషాల్లో ల్యాండ్‌ అవుతుందనగా.. సాంకేతికలోపం కారణంగా ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. పాపువా న్యూగినియాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్సామిన్‌ నుంచి కియుంగా ప్రాంతానికి ప్రయాణికులతో బయలుదేరిన సన్‌బ్రిడ్‌ ఏవియేషన్‌ విమానం ఇంజిన్‌ ఫెయిల్‌ అయింది.

దీంతో కియుంగా ఎయిర్‌పోర్టుకు సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్‌ సహా విమానంలోని ప్రయాణికులంతా మృతిచెందారు.

PNG plane crash leaves 12 dead: Reports

విమానంలో ముగ్గురు చిన్నారులు, ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి సహా 12 మంది ఉన్నారు. ఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. మృతులకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 19 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

English summary
Twelve people, including an Australian, were killed when a light plane crashed just short of a landing strip in remote Papua New Guinea, reports said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X