షాక్ : బస్సులో 120 త్రాచు పాములు..
విన్ పుక్ ప్రావిన్స్ నుంచి హో కి మిన్ నగరానికి 220కేజీల బరువున్న 120 త్రాచు పాములను ఓ ముఠా బస్సులో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
హనోయ్: 220కేజీల బరువున్న 120 త్రాచు పాములను బస్సులో అక్రమంగా తరలిస్తూ.. అడ్డంగా పోలీసులకు బుక్కయిపోయింది ఓ ముఠా. విన్ పుక్ ప్రావిన్స్ నుంచి హో కి మిన్ నగరానికి అక్రమంగా పాములను తరలిస్తుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బస్సులోని ప్లాస్టిక్ డబ్బాలను తెరిచి చూడగా.. అందులో త్రాచుపాములు ఉండడం గమనించారు పోలీసులు.

అలా.. వేర్వేరు ప్లాస్టిక్ డబ్బాల్లో మొత్తం 120 త్రాచు పాములను తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదేశంలో ఇలాంటి అక్రమాలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర వస్తువులు మరియు జీవరాశులను తరలించే చర్యలను వియత్నాంలో తీవ్రంగా పరిగణిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, సదరు ముఠా తరలిస్తున్న పాములన్ని ప్రాణంతో ఉన్నవే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications