వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్నీ.. బ్యాంకు దోపిడీ కోసం రూ.8 కోట్లు ఖర్చుపెట్టారు! అంతచేసినా చివరికి...

చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీకి పథకం వేసింది 16 మంది దొంగల ముఠా. తమ స్థావరం నుంచి బ్యాంకు భోషాణం దాకా సొరంగం కూడా తవ్వారు. కానీ డామిట్, కథ అడ్డం తిరిగింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సావోపోలో : చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీకి పథకం వేసింది 16 మంది దొంగల ముఠా. తమ స్థావరం నుంచి బ్యాంకు భోషాణం దాకా సొరంగం కూడా తవ్వారు. కానీ డామిట్, కథ అడ్డం తిరిగింది. సొరంగం గుట్టు రట్టవడంతో ఆ దొంగల ముఠా ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తోంది.

బ్రెజిల్‌లోని సావోపోలోలో జరిగిందీ ఘటన. నేషనల్ బ్యాంకులోని 24 కోట్ల పౌండ్ల (భారతీయ కరెన్సీలో రూ.2400 కోట్లు) సొమ్ము దొంగిలిద్దామనేది పథకం. దొంగలు తమ స్థావరం నుంచి బ్యాంకు భోషాణం దాకా 550 అడుగుల పొడవైన సొరంగం కూడా తవ్వారు. వేసిన పథకం విజయవంతంగా అమలుజరిగి ఉంటే.. ఇది అతిపెద్ద బ్యాంకు దోపిడీగా రికార్డుకెక్కేది.

tunnel

నాలుగు నెలలు అహోరాత్రాలు కష్టపడి అద్దెకు తీసుకున్న స్థావరం నుంచి నేరుగా బ్యాంకు స్ట్రాంగ్‌రూం వరకు సొరంగం తవ్వారు. దోపిడీ కోసం సొరంగం తవ్వినా ఆదరాబాదరాగా అన్నట్టుగా కాకుండా వృత్తిపరమైన నైపుణ్యమంతా చూపారా దొంగలు.

సొరంగ మార్గంలో మట్టిపెళ్లలు విరిగిపడకుండా చెక్కలు పేర్చి, స్తంభాలు అదరువుగా పెట్టారు. లోపల అంతా స్పష్టంగా కనిపించేలా లైట్లు అమర్చారు. అక్కడక్కడా విశ్రాంతిగా కూర్చునేందుకు స్టూల్స్ కూడా పెట్టారు.

మొత్తంమ్మీద ఓ మనిషి సునాయాసంగా నడిచివెళ్లేందుకు వీలుగా సొరంగం సిద్ధం చేశారు. మరి అంతభారీ సొరంగమంటే ఊరికే అవుతుందా? ఈ సొరంగం తవ్వడానికి 9,58,808 పౌండ్లు ఖర్చయ్యాయట. అంటే.. మన కరెన్సీలో రూ.8 కోట్లు. ఈ ఖర్చునంతా 16 మంది దొంగలు సమానంగా భరించారు.

ఈ దోపిడీ ప్రయత్నం గురించి పోలీసులకు ముందుగానే ఉప్పందింది. అయినాసరే వారు ఓపికగా రెండునెలలు ఈ దొంగలముఠా కదలికలు గమనిస్తూ కూర్చున్నారు. సొరంగం దాదాపుగా పూర్తయిన తర్వాత రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసి ఆట కట్టించారు. సొరంగం తవ్వడంలో వారి పనితనం చూసి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు.

English summary
Brazilian police say they have foiled a bank heist plot in which would-be robbers dug a 1,600-foot (500-metre) tunnel to a Sao Paulo branch of government-owned Banco do Brazil. The Sao Paulo state Public Safety Department said on Tuesday in a statement that agents had been monitoring the gang for three months but only discovered the tunnel on Monday.By then the tunnel was complete. But police arrested 16 suspects before they could pull off the heist. Investigator Fabio Pinheiro Lopes said the gang spent $1.27 million to build the tunnel from a rented home nearby.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X