వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్‌లో మోడీ ఎక్స్ ప్రెస్ బస్సు ప్రారంభం

|
Google Oneindia TeluguNews

లండన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనను విజయవంతం చెయ్యడానికి అక్కడి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) సిద్దమయ్యారు. నెల రోజుల పాటు బ్రిటన్ లోని ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో మోడీ ఎక్స్ ప్రెస్ పేరుతో బస్సు యాత్ర మొదలు పెట్టారు.

ఆదివారం ఈ యాత్ర ప్రారంభమైందని నరేంద్ర మోడీ స్వాగత కమిటి ప్రతినిధి మయూరి పార్కర్ తెలిపారు. బ్రిటన్‌లో లిటిల్ ఇండియాగా ప్రఖ్యాంతి గాంచిన వెంబ్లే లోని ఈ లింగ్ రోడ్డుకు ముందుగా ఈ బస్సు చేరుకుంటుంది. తరువాత బ్రిటన్ లో ప్రసిద్ధి చెందిన నగరాలలో సంచరిస్తుంది.

Prime Minister Narendra Modi Express bus launched in UK

దీపావళి పండగ నాటికి టాఫల్ గర్ స్క్వేర్ కు ఈ బస్సు చేరుకుంటుందని వివరించారు. వచ్చే నెల ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటి సారి బ్రిటన్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బస్సు పే చర్చ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ప్రవాస భారతీయులు చెప్పారు.

నవంబర్ 13వ తేదిన వెంబ్లే స్టేడియంలో మోడీకి ఒలంపిక్స్ తరహాలో స్వాగతం చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే వందలాది మంది ప్రవాస భారతీయులు వారి పేర్లు నమోదు చేసుకున్నారు.

English summary
Mayuri Parmar of the 'UK Welcomes Modi' organising committee said, "We have had 'Chai Pe Charcha' in India, now we will have 'Bus Pe Charcha' in the UK."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X